News February 1, 2025
బాన్సువాడ: శంకుస్థాపన చేయనున్న హైకోర్టు జడ్జీలు

బాన్సువాడ పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నూతన భవన నిర్మాణానికి శనివారం రాష్ట్ర హైకోర్టు జడ్జిలు జే.శ్రీనివాస్ రావు, అలిశెట్టి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి శంకుస్థాపన చేయనున్నట్లు బాన్సువాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాన్సువాడ, బిచ్కుంద కోర్టు పరిధిలోని న్యాయవాదులు సిబ్బంది హాజరుకావాలన్నారు.
Similar News
News November 4, 2025
విశాఖలో 1.89 లక్షల కేజీల గోమాంసం సీజ్

విశాఖ శివారు ప్రాంతమైన ఆనందపురం మండలం మామిడిలోవ పంచాయతీలో భారీ మొత్తంలో గోమాంసాన్ని పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా గోమాంసాన్ని ఎగుమతి చేస్తున్నారు. పూర్తి వివరాలతో ఓ వెటర్నరీ డాక్టర్ విశాఖ సీపీ శంఖబ్రత భాగ్చీకి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 1.89 లక్షల కేజీల గో మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.
News November 4, 2025
BELలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News November 4, 2025
అష్టైశ్వర్యాలు అంటే ఏంటి?

పెద్దలు మనల్ని దీవించేటప్పుడు ‘అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు’ అని అంటారు. మరి ఆ అష్టైశ్వర్యాలేంటో మీరెప్పుడైనా ఆలోచించారా? ఐశ్వర్యం అంటే సంపద. అష్ట అంటే 8. అందుకే అష్టైశ్వర్యాలంటే డబ్బే అనుకుంటారు. కానీ, కాదు. రాజ్యం, ధనం, ఇల్లాలు, సంతానం, ధైర్యం, ఆత్మస్థైర్యం, విద్య, వినయం.. ఇవే 8 ఐశ్వర్యాలు. మన జీవితం ఆనందంగా ఉండాలంటే కావాల్సినవి ఇవే. డబ్బు కాదు. అందుకే ఇవి కలగాలని పెద్దలు మనల్ని అలా జీవిస్తారు.


