News February 1, 2025
బాన్సువాడ: శంకుస్థాపన చేయనున్న హైకోర్టు జడ్జీలు

బాన్సువాడ పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నూతన భవన నిర్మాణానికి శనివారం రాష్ట్ర హైకోర్టు జడ్జిలు జే.శ్రీనివాస్ రావు, అలిశెట్టి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి శంకుస్థాపన చేయనున్నట్లు బాన్సువాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాన్సువాడ, బిచ్కుంద కోర్టు పరిధిలోని న్యాయవాదులు సిబ్బంది హాజరుకావాలన్నారు.
Similar News
News February 9, 2025
సిద్దిపేట: జాతీయ స్థాయి పోటీలకు జిల్లా విద్యార్థినులు

గత నెలలో తూప్రాన్లో నిర్వహించిన SGF అండర్ 14 సాఫ్ట్ బాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నంగునూరు మండలం గట్ల, మల్యాల విద్యార్థినిలు ఈశ్వరి, అను జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థులను హెచ్ఎం రమేష్, వ్యాయామ ఉపాధ్యాయులు రాజకుమార్ అభినందించారు. వారు మాట్లాడుతూ 13 నుంచి 16 వరకు మహారాష్ట్రలో జరిగే పోటీల్లో ఈశ్వరి, అను పాల్గొంటారని తెలిపారు.
News February 9, 2025
UPDATE: రోడ్డు ప్రమాదంలో గాయాల పాలయింది వీరే

డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గ్రామ శివారులో శనివారం సాయంత్రం కారు చెట్టును ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై డిచ్పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. ఆర్యనగర్కు చెందిన గణేశ్, నరేశ్, రమేశ్, జగన్గా గుర్తించారు. కరీంనగర్ ఫంక్షన్కు వెళ్లి తిరిగి వస్తుండగా ధర్మారంలో కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. గాయాలైన యువకులు చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ షరీఫ్ తెలిపారు.
News February 9, 2025
ఫోన్ స్క్రీన్ టైమ్ ఇలా తగ్గించుకోండి!

* అనవసరమైన యాప్ల నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి.
* 30minకి ఒకసారి స్క్రీన్ బ్రేక్ తీసుకోండి. వారంలో ఒక రోజు ఫోన్ వాడకండి.
* బుక్స్ చదవడం, వ్యాయామం, పెయింటింగ్ వంటివి చేయండి
* బాత్రూమ్, బెడ్ రూమ్లోకి ఫోన్ తీసుకెళ్లొద్దు
* ఫోన్ వాడకాన్ని తగ్గిస్తున్నట్లు మీ ఫ్రెండ్స్కు చెప్పండి. మెసేజ్లకు లేట్గా రిప్లై ఇచ్చినా ఏం కాదు
* ఫోన్ ఎక్కువగా వాడొద్దన్న విషయాన్ని పదే పదే గుర్తుచేసుకోండి.