News January 30, 2025
బాపట్లలో ఎన్నికల కోడ్ అమలు

బాపట్ల పట్టణంలో గురువారం నుంచి ఎమ్మెల్సీ పట్టబద్రుల ఎన్నికల కోడ్ అమలు చేస్తున్నట్లు బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి చెప్పారు. గురువారం బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పట్టణంలోని ప్రధాన రహదారుల వెంబడి పార్టీలకు సంబంధించిన బ్యానర్లు, జెండాలు ఉండరాదని వెంటనే స్వచ్ఛందంగా తొలగించాలని సూచించారు.
Similar News
News October 25, 2025
శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ పిక్నిక్ ప్రదేశాలు ఇవే..

శ్రీకాకుళం జిల్లాలో కార్తీక వనభోజనాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నాలుగు ఆదివారాలు కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి పిక్నిక్లు జరుపుకోనున్నారు. మన జిల్లాలో వంశధారా, నాగావళి నదీ తీరాలు, కలింగపట్నం, బౌద్ధ శిల్పాలు, బారువా బీచ్, టెలినీలపురం, మణిభద్రపురం కొండప్రాంతాలు పిక్నిక్ జరుపుకొనే ప్రాంతాలుగా ప్రసిద్ధి పొందినవి. మరి మీరు ఎక్కడికి వెళ్తున్నారో కామెంట్ చేయండి.
News October 25, 2025
జగనామ జిల్లాలో కాకతీయ అనంతర శైలి శిల్పాలు!

జగనామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామ దేవతా ఆలయ రిజర్వాయర్ వద్ద రాష్ట్రకూట, కాకతీయ అనంతర శైలికి చెందిన నాగుల శిల్పాలు, శిథిల శిల్పాలు బయటపడ్డాయి. ఇక్కడ శివలింగం పట్టుకున్న వీరుడు, నక్క వాహనం కలిగిన శిథిల చాముండి శిల్పం కూడా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. మీ గ్రామంలో కూడా ఇలా చరిత్ర కలిగిన దేవాలయాలు, శిల్పాలు ఉంటే కామెంట్ చేయండి.
News October 25, 2025
విశాఖ: చెంబులో డబ్బులేస్తే రెట్టింపు అవుతాయని మోసం

తమ వద్ద ఉన్న రూ.30 కోట్ల విలువైన చెంబులో డబ్బులు వేస్తే రెట్టింపు అవుతాయని డాక్టర్ను మోసగించిన కేటుగాళ్లను ఆరిలోవ పోలీసులు అరెస్టు చేశారు. HYDకి చెందిన డా. ప్రియాంక వద్ద రైస్ పుల్లింగ్ పేరుతో అరకు చెందిన కొర్రా బంగార్రాజు, పెందుర్తికి చెందిన వనుము శ్రీనివాస్ రూ.1.70కోట్లు కాజేశారు. 6 నెలలైనా వారి నుంచి స్పందన లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించగా వారిని అరెస్టు చేశామని ACP నరసింహమూర్తి తెలిపారు.


