News April 13, 2025

బాపట్లలో చికెన్, మటన్ ధరలు ఇలా..!

image

బాపట్లలో ఆదివారం చికెన్, మటన్ ధరలకు డిమాండ్ పెరిగింది. నేడు కేజీ చికెన్ స్కిన్ లెస్ రూ.220, స్కిన్ రూ. 200ల వరకు విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ.900లుగా ఉంది. ఇవే ధరలు పలు మండలాలలో కొనసాగుతున్నాయి. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

Similar News

News February 24, 2026

182 గ్రామాల్లో 7.95 లక్షల పాసు పుస్తకాల పంపిణీ: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో రీ-సర్వే పూర్తయిన 182 గ్రామాల్లో ఇప్పటివరకు 79,500 పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసినట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. మార్చిలో మరో 10 గ్రామాల్లో పంపిణీకి సిద్ధంగా ఉన్నామన్నారు. ఏప్రిల్ నుంచి ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, మరిన్ని గ్రామాల్లో రైతులకు పాసు పుస్తకాలు అందజేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.

News February 24, 2026

కూలెంట్ ఉన్నచోటే తేడా జరిగి ఉండొచ్చు: వీరపాండియన్

image

AP: పాలకల్తీ <<19216426>>ఘటనకు<<>> సంబంధించి రక్తనమూనాలు సేకరించడం సహా పలు పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్యశాఖ కమిషనర్‌ వీరపాండియన్ తెలిపారు. పాలరుచిలో తేడా వచ్చిందని.. బాధితులకు తొలుత వాంతులు అయ్యాయని వివరించారు. ఒకే ప్రాంతం నుంచి రావడంతో వైద్యులకు అనుమానం వచ్చిందన్నారు. కూలెంట్ వద్దే ఏదైనా జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతాల్లో మరో నెలపాటు పరిస్థితులు పర్యవేక్షిస్తామన్నారు.

News February 24, 2026

భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల భూసేకరణను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన సమీక్షలో తారకరామ తీర్థసాగర్, తోటపల్లి, జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, తదితర పనుల పురోగతిని సమీక్షించారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ రహదారి, కాలువలు, ఎస్టీపీలు, ఒబేరాయ్ హోటల్‌కు సంబంధించిన భూసేకరణను గడువులోగా పూర్తి చేయాలన్నారు.