News April 12, 2025
బాపట్ల: ఇంటర్ విద్యార్థులారా GET READY

ఇంటర్ ఫలితాలు ఇవాళ ఉదయం 11గంటలకు విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. తొలిసారి ఇంటర్ పరీక్షలు రాసిన ఫస్ట్ ఇయర్ విద్యార్థుల కంటే ఎక్కువగా, భవిష్యత్ లక్ష్యాలపై ఆశలు పెట్టుకున్న సెకండ్ ఇయర్ విద్యార్థుల్లో ఆత్రుత కనిపిస్తోంది. బాపట్ల జిల్లాలో ఫస్టియర్ 10,838, సెకండియర్ 8,381, మొత్తం 19,219 మంది పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.
☛ ఫలితాల కోసం Way2News ఫాలో అవ్వండి.
Similar News
News November 11, 2025
WGL: పాలకవర్గాలు లేక నిధుల నిలిపివేత..!

గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయలేమని కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో నిధులపై ఆశలు వమ్మయ్యాయి. కేంద్ర నిధులు 2024 ఆగస్టు నుంచి రాష్ట్ర ఎస్ఎఫ్సీ నిధులు 2023 ఆగస్టు నుంచి నిలిచిపోయాయి. ఉమ్మడి WGL జిల్లాలోని 1708 జీపీల్లో సుమారు రూ.70 కోట్లు ట్రెజరీల్లో నిలిచి, గ్రామాల్లో అభివృద్ధి పనులు స్తబ్ధుగా మారాయి.
News November 11, 2025
రాష్ట్రమంతా చూస్తోంది.. ఓటేద్దాం పదండి!

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోలింగ్ <<18256499>>శాతం<<>> నిరాశపరుస్తోంది. బస్తీల నుంచి పోలింగ్ బూత్లకు కొంతమేర ఓటర్లు వస్తున్నప్పటికీ ధనికులుండే కాలనీల వారు ఆసక్తి చూపడం లేదు. ఓటు వేయకుంటే అభివృద్ధి, సమస్యల గురించి ప్రశ్నించే హక్కు ఉండదని ప్రజలు గ్రహించట్లేదు. ఈ నిర్లక్ష్యం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతమని విశ్లేషకులు చెబుతున్నారు. యువతరం ఇప్పటికైనా మేల్కొని తమ పౌర బాధ్యతను నిర్వర్తించాలి. *ఓటేద్దాం పదండి
News November 11, 2025
రూ.250 కోట్లలో జగన్ వాటా ఎంత: TDP

AP: టీటీడీకి 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని TDP ట్వీట్ చేసింది. దాని విలువ రూ.240.80 కోట్లు అంటే సుమారు రూ.250 కోట్ల కుంభకోణం జరిగినట్లు వివరించింది. ‘ఇందులో జగన్ వాటా ఎంత? జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి వాటా ఎంత? అసలు ఇది కమీషన్ కోసమే జరిగిందా? ఇంకేదైనా కుట్ర ఉందా?’ అని ట్వీట్ చేసింది. రెండేళ్ల పాటు లడ్డూ పవిత్రత దెబ్బతిందని, ఇది పాపం కాదా? అని ప్రశ్నించింది.


