News April 3, 2025

బాపట్ల: ఊరికి వెళ్తే సమాచారం ఇవ్వండి- ఎస్పీ

image

తాత్కాలికంగా ఇంటికి తాళాలు వేసి విహార యాత్రలు, తీర్ధయాత్రలకు వెళ్లేవారు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లలో సమాచారం ఇచ్చి వెళ్లాలని బాపట్ల ఎస్పీ తుషార్ డూడి గురువారం ప్రజలకు సూచించారు. వేసవి సెలవులను ఆసరాగా చేసుకొని తాళం వేసిన ఇళ్లలో జరిగే దొంగతనాలను అరికట్టేందుకు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు. సమాచారం ఇవ్వడం వల్ల ఆ ఇంటిపై నిరంతర పోలీస్ నిఘా ఉంచడానికి అవకాశం ఉంటుందన్నారు.

Similar News

News October 23, 2025

వనపర్తి జిల్లాలో 24 గంటల్లో నమోదైన వర్షపాతం

image

వనపర్తి జిల్లాలో 21 వర్షపాతం నమోదు కేంద్రాలలో గడచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా అత్యధికంగా విల్లియంకొండలో 10.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఏదుల 7.5 మి.మీ, ఆత్మకూర్ 7.3 మి.మీ, రేమెద్దుల 5.5 మి.మీ, జానంపేట 4.5 మి.మీ, వీపనగండ్ల 2.5 మి.మీ, వనపర్తి, వెలుగొండ, కేతపల్లి 1.8 మి.మీ, పెబ్బేరు 1.0 మి.మీ, రేవల్లి 0.8 మి.మీ, రేవల్లి 0.5 మి.మీ, మిగతా 8 కేంద్రాలలో 0.0 మి.మీ వర్షపాతం నమోదయింది.

News October 23, 2025

కృష్ణా: పొలాలపై వరుణుడి ఎఫెక్ట్

image

జిల్లాలో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగిపోయాయి. కంకి దశకు చేరిన వరి పంటలు పాడైపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికందే సమయంలో వర్షాలు విరుచుకుపడడంతో నష్టపోతున్నామని వారు ఆందోళన చెందుతున్నారు. వర్షం మరికొన్ని రోజులు కొనసాగితే పంటలు పూర్తిగా నాశనం అయ్యే ప్రమాదం ఉందని రైతులు భయపడుతున్నారు.

News October 23, 2025

ఇంజనీర్ టూ రౌడీ షీటర్..

image

ఇంజనీరింగ్ చదువుకున్న చింటూ మరైన్ ఇంజనీరింగ్‌గా పనిచేశారు. అనంతరం మేనమామ కటారి మోహన్‌కు రాజకీయంగా వెన్నుదన్నుగా నిలిచారు. చిత్తూరును అప్పట్లో శాసిస్తున్న సీకే బాబుకు దీటుగా చింటూ అంచెలంచెలుగా ఎదిగారు. 2007 డిసెంబర్ 31న సీకే బాబుపై జరిగిన బాంబ్ బ్లాస్ట్, అనంతరం గన్ ఫైరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి యావజ్జీవ శిక్ష వేశారు. ప్రస్తుత కేసులో అనేక షరత్తులతో బెయిల్‌పై ఉన్నారు.