News April 3, 2025

బాపట్ల: ఊరికి వెళ్తే సమాచారం ఇవ్వండి- ఎస్పీ

image

తాత్కాలికంగా ఇంటికి తాళాలు వేసి విహార యాత్రలు, తీర్ధయాత్రలకు వెళ్లేవారు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లలో సమాచారం ఇచ్చి వెళ్లాలని బాపట్ల ఎస్పీ తుషార్ డూడి గురువారం ప్రజలకు సూచించారు. వేసవి సెలవులను ఆసరాగా చేసుకొని తాళం వేసిన ఇళ్లలో జరిగే దొంగతనాలను అరికట్టేందుకు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు. సమాచారం ఇవ్వడం వల్ల ఆ ఇంటిపై నిరంతర పోలీస్ నిఘా ఉంచడానికి అవకాశం ఉంటుందన్నారు.

Similar News

News April 18, 2025

చిత్తూరు: పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

image

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం అందించే పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీలకు అంతర్జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎస్డీవో బాలాజీ తెలిపారు. అర్హులైనవారు ఈనెల 26వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు డీఎస్ఏ కార్యాలయాన్ని సంప్రదించాలని ఓ ప్రకటనలో కోరారు.

News April 18, 2025

మల్లన్న సేవలో సంగీత దర్శకుడు మణిశర్మ

image

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను సినీ సంగీత దర్శకుడు మణిశర్మ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు ఆయనను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ క్రమంలో ఆయనతో పలువురు ఫొటోలు దిగారు. సమరసింహారెడ్డి, అన్నయ్య, ఖుషి, ఆది, ఇంద్ర, అతడు, నారప్ప, ఆచార్య వంటి ఎన్నో చిత్రాలకు మణిశర్మ సంగీతం అందించారు.

News April 18, 2025

కర్ణాటకలో ప్రమాదం.. నలుగురు హిందూపురం వాసుల మృతి

image

హిందూపురానికి చెందిన నలుగురు వ్యక్తులు కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. హిందూపురం నుంచి కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా షహర్‌పూర్ వెళ్తుండగా బొలెరో- ట్రక్కు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులు నాగరాజు, సోము, నాగభూషణ్, మురళిగా గుర్తించామన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

error: Content is protected !!