News March 29, 2024
బాపట్ల ఎంపీగా గెలిచేదెవరు?

2019 బాపట్ల పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ గెలుపుపై మళ్లీ ఆశలు పెట్టుకుంది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాల్యాద్రి శ్రీరామ్పై నందిగం సురేశ్ 16,065 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2024 ఎన్నికల్లో టీడీపీ పార్లమెంట్ సీటును కైవసం చేసుకొనేందుకు రిటైర్డ్ డీజీపీ టి.కృష్ణప్రసాద్ను రంగంలోకి దింపింది. వైసీపీ తరఫున మళ్ళీ ఎంపీ నందిగం సురేశ్కే అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే.
Similar News
News November 24, 2025
మంగళగిరి చేనేతలకు గుడ్న్యూస్.. 12% మజూరీకి అంగీకారం

మంగళగిరి చేనేత కార్మికులు 2025-27 కాలానికి 12% మజూరీ రేటు ఇచ్చేందుకు అంగీకరించినట్లు మంగళగిరి చేనేత కార్మిక సంఘ సమన్వయ కమిటీ కన్వీనర్ పిల్లలమర్రి బాలకృష్ణ తెలిపారు. సోమవారం మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ కార్యాలయంలో మజూరి పెంపుదలపై సమావేశం నిర్వహించారు. ఆమోదించిన మజూరి ప్రకారం మాస్టర్ వీవర్స్ అసోసియేషన్, మంగళగిరి వస్త్ర ఉత్పత్తి విక్రయదారుల సంఘం ప్రతినిధులతో ఒప్పందం చేసుకున్నామని బాలకృష్ణ చెప్పారు.
News November 24, 2025
మహిళా సంఘాల విజయ గాథలు ‘అవని’: కలెక్టర్

మెప్మా మహిళా సంఘాలు సాధించిన విజయగాధలు ‘అవని’ సంచికలో మనమందరం చదవి స్ఫూర్తి పొందవచ్చని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. సోమవారం కలెక్టరేట్లో మెప్మా వార్షిక సంచిక ‘అవని’ కలెక్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళ పారిశ్రామిక విప్లవానికి గట్టి పునాదులు పడుతున్నాయన్నారు. మెప్మా మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ, కొత్త అవకాశాలను చూపిస్తూ ముందుకు సాగాలన్నారు.
News November 24, 2025
GNT: నేడు వంగర వెంకట సుబ్బయ్య జయంతి

తెలుగు సినిమా, నాటక రంగాలలో ప్రసిద్ధి చెందిన హాస్యనటుడు వంగర వెంకట సుబ్బయ్య జయంతి నేడు. ఆయన 1897, నవంబర్ 24న సంగం జాగర్లమూడిలో జన్మించారు. రంగస్థల ప్రస్థానంలో తెనాలిలో స్థిరపడి, ‘శ్రీకృష్ణ తులాభారం’ నాటకంలో వసంతకుడి వేషంతో కళాహృదయుల మన్ననలు అందుకున్నారు. ఆయన దాదాపు వందకు పైగా తెలుగు చిత్రాలలో నటించారు. ‘పెద్దమనుషులు’, ‘కన్యాశుల్కం’, ‘మాయాబజార్’ వంటి చిత్రాలలో తన హాస్యంతో ప్రేక్షకులను అలరించారు.


