News March 30, 2025
బాపట్ల: ఎస్పీ పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు

సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేసినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. సోమవారం రంజాన్ పండగ పురస్కరించుకొని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు ప్రకటించారు. కావున ప్రజలు అర్జీలు అందించేందుకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయానికి రావద్దని సూచించారు.
Similar News
News November 23, 2025
యాలాల: పెళ్లింట విషాదం.. పెళ్లికూతురి తండ్రి మృతి

కూతురు పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేసిన తండ్రికి అనుకోని ప్రమాదం జరిగింది. సంగంకుర్డు గ్రామానికి చెందిన అండాల అనంతయ్య తన కూతురి పెళ్లి ఆదివారం నిశ్చయించారు. పెళ్లికి ముందు ఇంట్లో బంధువుల సందడి నెలకొన్న సమయంలో, అనంతయ్య బైక్ పైనుంచి పడి, తీవ్ర గాయాలతో మృతి చెందారు. పెళ్లికి వచ్చిన వారే అంత్యక్రియల్లో పాల్గొనడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
News November 23, 2025
రేషన్ కార్డులు ఉన్న వారికి ఫ్రీగా క్లాత్ బ్యాగులు?

TG: వచ్చే నెల నుంచి రేషన్ కార్డులు ఉన్న వారికి సన్నబియ్యంతో పాటు మల్టీ పర్పస్ క్లాత్ బ్యాగులను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు సమాచారం. ప్లాస్టిక్ వినియోగం తగ్గించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యాగులపై ప్రభుత్వ 6 గ్యారంటీల లోగోలు ఉంటాయని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా OCTలోనే ఈ బ్యాగులను పంపిణీ చేయాల్సి ఉండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది.
News November 23, 2025
గద్వాల్: మానవత్వానికి మారుపేరు సత్యసాయి బాబా

మానవత్వానికి మారుపేరుగా సత్య సాయి బాబా నిలిచారని ఆయన సేవలను ఎల్లప్పుడూ స్మరించుకోవాలని కలెక్టర్ కార్యాలయ ఏ.ఓ.భూపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం సత్య సాయిబాబా పుట్టినరోజు సందర్భంగా శత జయంతి ఉత్సవాలను ఆదివారం గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అధికారికంగా నిర్వహించారు. భగవాన్ సత్యసాయి బాబా చిత్రపటానికి పూల మాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళి అర్పించారు.


