News March 20, 2025
బాపట్ల: కలెక్టర్ను కలిసిన R&B ఈఈ

బాపట్ల జిల్లా రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా ఆర్. రాజా నాయక్ గురువారం బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కలెక్టర్కు మొక్కను అందజేశారు.
Similar News
News October 29, 2025
మంచిర్యాల: మావోయిస్టు కీలక నేత బండి ప్రకాశ్ లొంగుబాటు

మావోయిస్టు కీలక నేత బండి ప్రకాశ్ హైదరాబాద్లో డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో మంగళవారం లొంగిపోయారు. మందమర్రిలో పుట్టి పెరిగిన బండి ప్రకాశ్ గత 40సంవత్సరాలపాటు వివిధ హోదాల్లో మావోయిస్టు పార్టీలో పని చేశారు. బండి ప్రకాశ్ సింగరేణి ప్రాంతంలో సీకాస కార్యదర్శిగా పనిచేసే కార్మికుల ఎన్నో సమస్యలను పరిష్కరించిన సందర్భాలు ఉన్నాయి. ప్రకాశ్ లొంగిపోవడంతో సీకాసకు పెద్ద అండ కోల్పోయినట్లుగా స్థానికులు భావిస్తున్నారు.
News October 29, 2025
$4 ట్రిలియన్ల క్లబ్.. యాపిల్ అరుదైన ఘనత

టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీ మార్కెట్ విలువ $4 ట్రిలియన్లు దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన మూడో కంపెనీగా నిలిచింది. ఇవాళ కంపెనీ షేర్లు 0.2% పెరిగి $267.87కు చేరాయి. SEPT 9న ఐఫోన్ 17 సిరీస్, ఐఫోన్ ఎయిర్ లాంచ్ చేసినప్పటి నుంచి కంపెనీ స్టాక్ 13% పెరిగింది. చైనాలో కాంపిటీషన్, US టారిఫ్స్ ప్రతికూలతలను ఎదుర్కొని లాభాలు గడించింది. యాపిల్ కంటే ముందు Nvidia, మైక్రోసాఫ్ట్ $4T కంపెనీలుగా అవతరించాయి.
News October 29, 2025
కాజ టోల్గేటు వద్ద భారీ వాహనాల నిలిపివేత

తుఫాను కారణంగా మంగళవారం అర్ధరాత్రి వర్షం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మంగళగిరి రూరల్ పోలీసులు అప్రమత్తమయ్యారు. గతంలో భారీ వర్షానికి వరదనీరు చేరిన కాజా టోల్ ప్లాజా వద్ద ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ తన సిబ్బందితో కలిసి భారీ వాహనాలను నిలుపుదల చేస్తున్నారు. అవసరం లేనిదే ప్రజలు రోడ్లపైకి రావద్దని పోలీసులు సూచించారు.


