News March 20, 2025

బాపట్ల: కలెక్టర్‌ను కలిసిన R&B ఈఈ

image

బాపట్ల జిల్లా రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ఆర్. రాజా నాయక్ గురువారం బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కలెక్టర్‌కు మొక్కను అందజేశారు.

Similar News

News April 23, 2025

వీరబల్లి: ప్రభుత్వ స్కూల్ అమ్మాయికి 595 మార్కులు

image

ఏపీలో బుధవారం ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్ల అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం రెడ్డివారిపల్లె గ్రామం, పెద్దవీడు జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని రాసినాటి మేఘ 595/600 మార్కులు సాధించినట్లు డీఈవో శివకుమార్, హెచ్ఎం మధుసూదన రాజు తెలిపారు. మండల, జిల్లా స్థాయిలో కాకుండా, రాష్ట్రస్థాయిలో కూడా విజయ దుందుభి మోగించిట్లు తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేసిన ఉపాధ్యాయులను అభినందించారు.

News April 23, 2025

‘అప్పుడు లేచిన నోళ్లు.. ఇప్పుడు లేవడం లేదే?’

image

బాలీవుడ్ సెలబ్రిటీలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాజాకు సంబంధించి ‘All Eyes On Rafah’ అని SMలో ఊదరగొట్టిన బీటౌన్ బడా నటులంతా ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నిస్తున్నారు. J&K పహల్‌గామ్‌లో ఉగ్రవాదులు చేసిన దాడిలో 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోతే వారికి పట్టడం లేదంటూ విమర్శిస్తున్నారు. ‘అప్పుడు లేచిన నోళ్లు.. ఇప్పుడు లేవడం లేదే’ అని నిలదీస్తున్నారు.

News April 23, 2025

నాగర్‌కర్నూల్: 60 రోజులు.. కొనసాగుతున్న అన్వేషణ..!

image

నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ పరిధి SLBC సొరంగంలో ప్రమాద ఘటనకు 60 రోజులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలు లభించాయి. మిగతా ఆరుగురి కోసం అన్వేషణ కొనసాగుతోంది. డీ-1 నుంచి డీ-2 ప్రదేశం వరకు దాదాపు శిథిలాలు తొలగించారు. డేంజర్ జోన్ అయిన మిగిలిన 43 మీటర్ల పరిధిలో ఆ ఆరుగురి మృతదేహాలు ఉండొచ్చని సిబ్బంది అభిప్రాయానికి వచ్చారు. 12 రకాల విభాగాల అధికారులు నిత్యం రెస్క్యూ చేస్తున్నారు.

error: Content is protected !!