News February 1, 2025
బాపట్ల: గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పిస్తే బహుమతి

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని వైద్యశాలలో చేర్పిస్తే కేంద్ర ప్రభుత్వం రూ.5000 బహుమతి అందజేస్తుందని బాపట్ల మోటార్ వాహన తనిఖీ అధికారి ప్రసన్నకుమారి చెప్పారు. రహదారి భద్రత మహోత్సవాలలో భాగంగా శనివారం బాపట్ల ప్రభుత్వ వైద్యశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘గుడ్ సమారిటన్’ అనే పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.
Similar News
News November 9, 2025
మాగంటి మృతిపై విచారణ జరపాలని తల్లి ఫిర్యాదు

TG: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతిపై అనుమానాలున్నాయని ఆయన తల్లి మహానంద కుమారి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతిపై విచారణ చేయాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతకుముందు మాగంటి మరణంపై సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ <<18218398>>కేటీఆర్ను<<>> ఆమె డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
News November 9, 2025
కమనీయంగా వేములవాడ రాజన్న కళ్యాణం

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాన్ని హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్స్లో శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. భక్తి టీవీ కోటి దీపోత్సవం కార్యక్రమంలో భాగంగా వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు రాజన్న ఆలయ అర్చకులు, వేద పండితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య కళ్యాణం జరిపించారు.
News November 9, 2025
HYD: అవినీతి పాలనకు ముగింపు పలకాలి: BJP

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా వెంగళ్రావునగర్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లుగా BRS పాలనలో.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోనూ HYD అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని, ప్రజలు ఈసారి అవినీతి, మోసపూరిత పాలనకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.


