News February 1, 2025

బాపట్ల: గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పిస్తే బహుమతి

image

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని వైద్యశాలలో చేర్పిస్తే కేంద్ర ప్రభుత్వం రూ.5000 బహుమతి అందజేస్తుందని బాపట్ల మోటార్ వాహన తనిఖీ అధికారి ప్రసన్నకుమారి చెప్పారు. రహదారి భద్రత మహోత్సవాలలో భాగంగా శనివారం బాపట్ల ప్రభుత్వ వైద్యశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘గుడ్ సమారిటన్’ అనే పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. 

Similar News

News February 10, 2025

ఏపీలో లిక్కర్ ధరలు పెంపు!

image

AP: రాష్ట్రంలోని మందుబాబులకు బ్యాడ్ న్యూస్. మద్యంపై 15 శాతం మేర ధరలు పెంచాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఇటీవల మద్యం అమ్మకాలపై మార్జిన్‌ను 14.5 నుంచి 20 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. దీంతో ధరల పెంపు అనివార్యమైనట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఇకపై 3 కేటగిరీలుగా(ఇండియన్ మేడ్, ఫారిన్ మేడ్, బీర్) మద్యం సరఫరా ఉంటుందని తెలిపాయి. రూ.99 మద్యం, బీర్లపై పెంపు ఉండదని చెప్పాయి.

News February 10, 2025

30 ఏళ్లు దాటిన మహిళలు ఈ పరీక్షలు చేసుకోవాలి!

image

1. మామోగ్రఫీ- దీని ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు గుర్తించవచ్చు. 2.పాప్ స్మియర్ టెస్ట్ – గర్భాశయ క్యాన్సర్‌ను ముందుగా గుర్తించవచ్చు. 3.కంప్లీట్ బ్లడ్ కౌంట్(CBC)- రక్తహీనతతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలను దీని ద్వారా గుర్తించవచ్చు. 4. థైరాయిడ్ 5. విటమిన్ -D, కాల్షియం టెస్ట్. ఈ పరీక్షలు చేయించుకొని దానికి తగ్గట్లు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
SHARE IT

News February 10, 2025

సీఎం రేవంత్‌కు లేఖ రాసిన మందకృష్ణ

image

TG: ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు MRPS స్థాపకుడు మందకృష్ణ మాదిగ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ‘జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ నివేదికలో లోపాలు ఉన్నాయి. లోపాల వల్ల కొన్ని కులాల హక్కులు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. నివేదికపై చర్చించి సూచనలు ఇవ్వడానికి సీఎంను కలవాలని అనుకుంటున్నాం. సాధ్యమైనంత త్వరలో మీ విలువైన సమయాన్ని కేటాయించాలని కోరుతున్నాం’ అని లేఖలో విజ్ఞప్తి చేశారు.

error: Content is protected !!