News February 8, 2025

బాపట్ల: ‘గ్రామాల్లో ప్రజలు ప్రశాంతంగా ఉండాలి’

image

గ్రామాలలో ప్రజలు కలిసిమెలిసి జీవిస్తూ ప్రశాంత వాతావరణం సృష్టించాలని బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ చెప్పారు. శుక్రవారం కర్లపాలెం మండలం హైదర్పేట గ్రామంలో ఆయన పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాలపట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాలలో అనుమానిత వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఎవరైనా పేకాట, కోడిపందాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని సూచించారు.

Similar News

News November 22, 2025

గర్భిణులు రోజుకెంత ఉప్పు తీసుకోవాలంటే..

image

గర్భిణులు ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కొందరు ఎక్కువ ఉప్పు తింటే మరికొందరు తక్కువ ఉప్పు తింటారు. కానీ గర్భిణులు రోజుకి 3.8గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలంటున్నారు నిపుణులు. మరీ తప్పనిసరి పరిస్థితుల్లో అయితే 5.8గ్రాముల వరకు తీసుకోవచ్చు. దీని కంటే ఎక్కువగా తీసుకుంటే కాళ్లు, చేతుల వాపులు, తరచుగా మూత్రవిసర్జన, అధిక రక్తపోటు సమస్యలు వస్తాయని గైనకాలజిస్ట్‌లు చెబుతున్నారు.

News November 22, 2025

APPLY NOW: సింగరేణిలో 82 పోస్టులు

image

సింగరేణిలో 82 ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పోస్టులను ఇంటర్నల్ అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 24లోగా అప్లై చేసుకోవాలి. దరఖాస్తు హార్డ్ కాపీని ఈనెల 26లోగా పంపాలి. బేసిక్ శాలరీ నెలకు రూ.50,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: scclmines.com

News November 22, 2025

కులశేఖర పడి కథ మీకు తెలుసా..?

image

12 మంది ప్రసిద్ధ ఆళ్వార్లలో కులశేఖరాళ్వార్ ఒకరు. ఆయన కేరళను పాలించిన ఓ క్షత్రియ రాజు. ఆయన రాజు అయినప్పటికీ దాస్యభక్తికి ప్రతీకగా నిలిచాడు. మహావిష్ణువుపై అచంచల భక్తితో ‘పెరుమాళ్ తిరుమొళి’ అనే పాటలు రచించారు. ‘స్వామీ! నీ సన్నిధిలో కనీసం గడపగానైనా ఉండిపోవాలి’ అని కోరుకున్నారు. కోరుకున్నట్లే చివరకు ఆయన తిరుమల శ్రీవారి ఆలయంలో కులశేఖర పడిగా మారారనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. <<-se>>#VINAROBHAGYAMU<<>>