News March 9, 2025
బాపట్ల : చికెన్, మటన్ ధరలు ఇలా..!

బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఆదివారం చికెన్, మటన్ధరలకు డిమాండ్ పెరిగింది. గతవారంతో పోలిస్తే కేజీకి రూ.20-30 ధర పెరిగింది. పలు చోట్ల ఈ వారం కేజీ చికెన్ స్కిన్ లెస్ రూ.200, స్కిన్ రూ. 180ల వరకు విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ.800- 900లు ఉంది. బర్డ్ ఫ్లూ భయాందోళనలు తగ్గడంతో చికెన్ ధరలలో రూ.30లకు పైగా ధర పెరిగింది. మరి మీ ప్రాంతంలో ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News December 2, 2025
టీజీ అప్డేట్స్

* ఇందిరా మహిళా శక్తి స్కీమ్లో మహిళా సంఘాలకు మరో 448 బస్సులు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం. ఇప్పటికే 152 బస్సులు అందజేత
* రేపు లేదా ఎల్లుండి పెద్దపల్లి జిల్లాలోని అంతర్గాంలో రామగుండం ఎయిర్పోర్ట్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించనున్న ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI) టీమ్.
* ఈ నెల 5 నుంచి 14 వరకు హైదరాబాద్లో యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్. పూర్తి వివరాలకు <
News December 2, 2025
ధాన్యం సేకరణలో అవకతవకలు జరగకుండా నిఘా పెట్టాలి: బాపట్ల కలెక్టర్

బాపట్ల జిల్లాలోని రైస్ మిల్లులలో ధాన్యం భద్రతపై కలెక్టర్ వినోద్ కుమార్ సోమవారం కస్టోడియన్ అధికారులను అప్రమత్తం చేశారు. ధాన్యం సేకరణలో అవకతవకలు జరగకుండా నిఘా పెట్టాలని, మిల్లులకు వచ్చే ధాన్యాన్ని పక్కదారి పట్టనీయకుండా ప్రతిరోజు పర్యవేక్షించి ఫొటోలు పంపాలని ఆదేశించారు. వర్షాలకు ధాన్యం తడవకుండా టార్పాలిన్ పట్టలతో కప్పేలా చూడాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ 1967ను సంప్రదించాలన్నారు.
News December 2, 2025
తిరుపతి జిల్లాలో నకిలీ CI అరెస్ట్

తిరుపతి జిల్లా భాకరాపేటలో నకిలీ CI హల్చల్ చేశాడు. అన్నమయ్య జిల్లాకు చెందిన కురబోతుల శివయ్య అలియాస్ శివకుమార్(33) తాను కడప స్పెషల్ బ్రాంచ్ CIనని నమ్మబలికాడు. స్థానిక గొడవల్లో జోక్యం చేసుకుని బెదిరించాడు. ఒకరి దగ్గర బంగారు ఉంగరాన్ని కొట్టేశాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కొందరి నుంచి డబ్బులు వసూలు చేశాడు. దీంతో అతడిని అరెస్ట్ చేశామని భాకరాపేట CI ఇమ్రాన్ బాషా వెల్లడించారు.


