News March 9, 2025
బాపట్ల : చికెన్, మటన్ ధరలు ఇలా..!

బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఆదివారం చికెన్, మటన్ధరలకు డిమాండ్ పెరిగింది. గతవారంతో పోలిస్తే కేజీకి రూ.20-30 ధర పెరిగింది. పలు చోట్ల ఈ వారం కేజీ చికెన్ స్కిన్ లెస్ రూ.200, స్కిన్ రూ. 180ల వరకు విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ.800- 900లు ఉంది. బర్డ్ ఫ్లూ భయాందోళనలు తగ్గడంతో చికెన్ ధరలలో రూ.30లకు పైగా ధర పెరిగింది. మరి మీ ప్రాంతంలో ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News March 27, 2025
ఎల్లారెడ్డిపేట: మోర్చా కార్యదర్శిగా బుర్కా సంగీత

రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా మోర్చా కార్యదర్శిగా బుర్కా సంగీత నియమించినట్లు ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి తెలిపారు. బుర్కా సంగీత గత 20 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, భూత్ అధ్యక్షరాలిగా, మండల నాయకురాలిగా భారతీయ జనతా పార్టీలో వివిధ పదవులు పొంది ఇప్పుడు మహిళా మోర్చా జిల్లా కార్యదర్శిగా నియమించడం సంతోషకరమని మండల నాయకులు అందరూ అభినందనలు తెలిపారు.
News March 27, 2025
‘తెలుగు నేర్చుకో..’ అక్బరుద్దీన్ ఒవైసీపై మాజీ ఐఏఎస్ ఫైర్

TG: ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే <<15896404>>అక్బరుద్దీన్పై<<>> మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళీ ఫైరయ్యారు. ‘మంత్రి సీతక్కకు హిందీ రాదు సరే.. హైదరాబాద్లోనే పుట్టి పెరిగిన నీకు తెలుగు ఎందుకు రాదు?’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు మాట్లాడే తొలి అధికార భాష తెలుగును నేర్చుకోవాలనే బాధ్యత ఉండాలని హితవు పలికారు. తెలుగు రానప్పుడు సభ్యులు లేవనెత్తే సమస్యలు ఎలా అర్థమవుతాయని దుయ్యబట్టారు.
News March 27, 2025
విక్రమ్ ‘వీర ధీర శూర’కు లైన్ క్లియర్

అనివార్య కారణాలతో ఇవాళ మార్నింగ్ షోలు రద్దయిన ‘వీర ధీర శూర’ చిత్రానికి ఊరట లభించింది. ఈవినింగ్ షో నుంచి సినిమా ప్రదర్శన ఉంటుందని తెలుగు డిస్ట్రిబ్యూటర్ మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. ఇప్పటికే రద్దైన షోలకు డబ్బులు తిరిగిస్తామని సినీ ప్రేక్షకులకు థియేటర్ల యాజమాన్యాలు తెలిపాయి. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమ్, దుషారా విజయన్ , ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించారు.