News March 28, 2025

బాపట్ల జిల్లాకు మంచి రోజులు..!

image

బాపట్ల జిల్లాకు నిన్న ఒక్కరోజే రెండు శుభవార్తలు అందాయి. సూర్యలంక బీచ్ అభివృద్ధికి 97.52 కోట్లు ఇవ్వడానికి కేంద్రం ముందుకొచ్చింది. నిజాంపట్నం(M) పరిశవారిపాలెం(దిండి) వద్ద రూ.88.08 కోట్లతో ఆక్వా పార్కు ఏర్పాటుకు అనుమతులు మంజూరయ్యాయి. ఇక్కడ రూ.25.79 కోట్లతో చేపలు, రూ.18.58 కోట్లతో రొయ్యలు, రూ.9.88కోట్లతో పీతలకు బ్లాక్స్ నిర్మిస్తారు. అలాగే రూ.13.78 కోట్లతో సీ ఫుడ్ పార్కు ఇతర పనులు చేపడతారు.

Similar News

News January 9, 2026

సిద్దిపేట: ‘ఎలక్టోరల్ మ్యాపింగ్ 100 శాతం పూర్తి చేయాలి’

image

సిద్దిపేట కలెక్టరేట్ నుంచి ఎలక్టోరల్ మ్యాపింగ్ ప్రక్రియ గూర్చి ఆర్డీఓ, తహశీల్దార్, సూపర్ వైజర్, బిఎల్ఓలతో కలెక్టర్ కె. హైమావతి జూమ్ సమావేశంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ఆయా మండలాల వారిగా మ్యాపింగ్‌లో వెనకబడిన బిఎల్ఓలతో సమీక్షించారు. జిల్లాలో ఎలక్టోరల్ మ్యాపింగ్ 100 శాతం మ్యాపింగ్ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

News January 9, 2026

ఇకపై షోరూంలోనే వెహికల్ రిజిస్ట్రేషన్

image

TG: రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ షోరూంలోనే పూర్తి చేసుకోవచ్చు. ఈ విధానం 15 రోజుల్లో అమలులోకి రానుంది. దీంతో ఇకపై కొత్త కారు, బైక్ కొన్నప్పుడు RTA ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. డీలర్ ఆన్‌లైన్‌లో అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి, రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు. RC నేరుగా స్పీడ్ పోస్ట్ ద్వారా ఇంటికే వచ్చేస్తోంది. ఈ సౌకర్యం నాన్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది.

News January 9, 2026

అమరావతిలో 3500 టన్నుల కంచుతో భారీ NTR విగ్రహం

image

AP: రాజధాని అమరావతి ప్రాంతంలోని నీరుకొండలో సుమారు 3500 టన్నుల కంచుతో భారీ NTR విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన డిజైన్లను క్యాబినెట్ సబ్‌ కమిటీ పరిశీలించింది. విగ్రహంతోపాటు స్మృతివనం డిజైన్లను ఫైనలైజ్ చేసేందుకు ప్రభుత్వం సబ్‌ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టును అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (AGICL) పర్యవేక్షించనుంది.