News March 28, 2025

బాపట్ల జిల్లాకు మంచి రోజులు..!

image

బాపట్ల జిల్లాకు నిన్న ఒక్కరోజే రెండు శుభవార్తలు అందాయి. సూర్యలంక బీచ్ అభివృద్ధికి 97.52 కోట్లు ఇవ్వడానికి కేంద్రం ముందుకొచ్చింది. నిజాంపట్నం(M) పరిశవారిపాలెం(దిండి) వద్ద రూ.88.08 కోట్లతో ఆక్వా పార్కు ఏర్పాటుకు అనుమతులు మంజూరయ్యాయి. ఇక్కడ రూ.25.79 కోట్లతో చేపలు, రూ.18.58 కోట్లతో రొయ్యలు, రూ.9.88కోట్లతో పీతలకు బ్లాక్స్ నిర్మిస్తారు. అలాగే రూ.13.78 కోట్లతో సీ ఫుడ్ పార్కు ఇతర పనులు చేపడతారు.

Similar News

News November 16, 2025

చొప్పదండి: డ్రంక్ అండ్ డ్రైవ్ ఫైన్‌కు భయపడి యువకుడి ఆత్మహత్య

image

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఫైన్ చెల్లించలేనన్న మనోవేదనతో చొప్పదండి బీసీ కాలనీకి చెందిన సూర విజయ్ (28) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ నరేష్ రెడ్డి తెలిపారు. ఈ నెల 1న పోలీసులకు పట్టుబడిన విజయ్, శనివారం కోర్టుకు హాజరైనప్పటికీ మేజిస్ట్రేట్ లేకపోవడంతో తిరిగి వచ్చాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫైన్ భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

News November 16, 2025

ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు

image

*17 నెలల్లో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు
*విశాఖ స్టీల్ ప్లాంటును తెల్ల ఏనుగుతో పోల్చిన చంద్రబాబు
*ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసిన సీఎం రేవంత్, MLA నవీన్ యాదవ్
*హిందూపురంలో మా కార్యాలయంపై టీడీపీ దాడి చేసింది: వైఎస్ జగన్
*రాజమౌళి-మహేశ్ బాబు సినిమా టైటిల్‌ ‘వారణాసి’.. ఆకట్టుకుంటున్న గ్లింప్స్
*సౌతాఫ్రికాతో టెస్టు.. విజయానికి చేరువలో భారత్

News November 16, 2025

KNR: విటమిన్ గార్డెన్ పై దృష్టి పెట్టాలి:కలెక్టర్

image

ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విటమిన్ గార్డెన్లపై బయోసైన్స్ ఉపాధ్యాయులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించి, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. గార్డెన్‌లను ఆకర్షణీయంగా ఏర్పాటు చేయడంతో పాటు, పండిస్తున్న కూరగాయలు, ఆకుకూరల్లోని విటమిన్లు, మినరల్స్‌ గురించి కూడా విద్యార్థులకు వివరించాలని ఆమె సూచించారు.