News March 11, 2025
బాపట్ల జిల్లాలో ఇంటర్ పరీక్షకు 471 మంది గైర్హాజరు

బాపట్ల జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 471 మంది విద్యార్థులు హాజరు కాలేదని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. జిల్లాలో రెగ్యులర్, ఒకేషనల్ కలిపి 10,679 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. కాగా 10,202 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరైనట్లు వెల్లడించారు. పటిష్ట బందోబస్తు నడుమ ప్రశాంతంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News November 27, 2025
ద్వారకాతిరుమల: GOOD NEWS.. ఐదేళ్ల నిరీక్షణకు తెర

ద్వారకాతిరుమల శ్రీవారి అంతరాలయ దర్శనం మరికొద్ది సేపట్లో పునః ప్రారంభం కానుంది. కరోనా కారణంగా ఐదేళ్ల క్రితం నిలిచిపోయిన ఈ దర్శనాన్ని మళ్లీ ప్రారంభిస్తున్నారు. సాధారణ దర్శనం కూడా అమ్మవార్ల వద్ద (దగ్గర) నుంచి ఏర్పాటు చేస్తున్నారు. శని, ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో వీటిని రద్దు చేస్తారు. అంతరాలయ దర్శనం టికెట్ ఒక్కొక్కరికి రూ.500 లు కాగా, రెండు లడ్డూ ప్రసాదాలను అందిస్తామని ఆలయ ఈవో NVSN మూర్తి తెలిపారు.
News November 27, 2025
దక్షిణామూర్తి చిత్రపటాన్ని ఇంట్లో ఏ రోజున ప్రతిష్ఠించాలి?

దక్షిణామూర్తి చిత్రపటాన్నిగురువారం రోజున ఇంట్లో ప్రతిష్ఠిస్తే సకల శుభాలు కలుగుతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. గురు గ్రహ ప్రభావం అధికంగా ఉండే ఈరోజున జ్ఞాన స్వరూపుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే విద్యాభివృద్ధి పెరుగుతుందని అంటున్నారు. ‘శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం, పండుగ రోజులలో విగ్రహ స్థాపన చేయవచ్చు. నిష్ణాతులైన పండితుల సలహా మేరకు ప్రతిష్ఠించడం మరింత శ్రేయస్కరం’ అని చెబుతున్నారు.
News November 27, 2025
రుద్రవరంలో యాక్సిడెంట్.. 150 బస్తాల ధాన్యం నేలపాలు

రుద్రవరం మండల పరిధిలోని గుట్టకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో వరి ధాన్యం లోడుతో వెళుతున్న డీసీఎం లారీ అదుపుతప్పి బోల్తా పడింది. గుట్టకొండ ప్రాంతం నుంచి సుమారు 150 బస్తాలు వరి ధాన్యం లోడుతో లారీ నంద్యాలకు బయలుదేరింది. మార్గమధ్యంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం దాటిన తర్వాత వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనం డ్రైవర్కు గాయాలయ్యాయి.


