News March 7, 2025
బాపట్ల జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 270 మంది గైర్హాజరు

బాపట్ల జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్ పరీక్షకు 270 మంది విద్యార్థులు హాజరు కాలేదని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 8,390 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 8120 మంది పరీక్షలకు వచ్చారు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు నడుమ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Similar News
News February 12, 2026
భూ వివాదాలు లేని మండలంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: కలెక్టర్

నల్లచెరువులో కదిరి ఆర్డీవో వీవీఎస్ శర్మ, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో గురువారం రెవెన్యూ గ్రామసభ నిర్వహించారు. కలెక్టర్ శ్యాం ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పాల్గొని గ్రామస్థుల నుంచి వినతులు స్వీకరించారు. అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా భూ వివాదాలు లేని మండలంగా నల్లచెరువు మండలాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.
News February 12, 2026
సంక్రాంతి సంబరాల కేసు.. అంబటికి రిమాండ్

AP: సంక్రాంతి వేళ లక్కీ డ్రా కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు స్పెషల్ ప్రిన్సిపల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. CM CBNపై అనుచిత వ్యాఖ్యలు సహా మరో కేసులో రాంబాబుకు ఇప్పటికే బెయిల్ లభించింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలవుతారని YCP శ్రేణులు భావించాయి. కానీ తాజాగా మరో కేసులో రిమాండ్ విధించడంతో ఇప్పట్లో విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు.
News February 12, 2026
మాజీ సీఎంసంజీవయ్య జన్మదిన వేడుకలను జయప్రదం చేయండి: కలెక్టర్

అనంతపురం జిల్లా కలెక్టరేట్లో ఈ నెల 14న ఏపీ తొలి దళిత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 105వ జన్మదిన వేడుకలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 14న ఉదయం 10:30 గంటలకు రెవెన్యూ భవన్లో కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ ఉత్సవాలకు జిల్లా అధికారులు, దళిత నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం కలెక్టర్ పిలుపునిచ్చారు.


