News March 8, 2025

బాపట్ల జిల్లాలో క్రీ.శ. 1871 నాటి వివిధ పట్టణాల జనాభా.!

image

బాపట్ల జిల్లాలో 1871వ సంవత్సరంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నప్పుడు మొత్తం జిల్లా జనాభా 15,48,480 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 7,80,588 మంది కాగా మహిళలు 7,67,892 మందిగా నమోదయ్యారు. అప్పటి పట్టణాల వారిగా బాపట్ల-6,086 మంది, చీరాల-9,061మంది ఉన్నారు. 1881 సంవత్సరంలో జనాభా గణన ప్రకారం 1871 కన్నా పురుషుల పెరుగుదల శాతం 5.84 కాగా, స్త్రీల పెరుగుదల శాతం 7.42గా ఉంది.

Similar News

News November 28, 2025

కేజీహెచ్‌లో బ్రెస్ట్ ఫీడింగ్ యూనిట్ ప్రారంభం

image

కేజీహెచ్‌లోని గైనిక్ వార్డులో బాలింతల కోసం బ్రెస్ట్ ఫీడింగ్ యూనిట్ ప్రాజెక్ట్‌ను ఆయుష్మాన్‌లో భాగంగా ఏర్పాటు చేశారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ ఐ.వాణి ఈ యూనిట్ ప్రారంభించారు. ఈ యూనిట్‌తో పిల్లల తల్లులకు అన్ని రకాల ఉపయోగాలు చేకూరుతాయని సూపరింటెండెంట్ వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వైద్యులు, సిబ్బంది, నిర్వాహకులు పాల్గొన్నారు.

News November 28, 2025

గంగాధర: రూపాయి బిళ్లలతో సర్పంచ్ నామినేషన్

image

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన జంగిలి మహేందర్ అనే యువకుడు వినూత్నంగా రూపాయి బిళ్లలతో నామినేషన్ వేశారు. గత ఎన్నికల్లో వార్డు మెంబర్‌గా పోటీ చేసిన మహేందర్.. ఒక్క ఓటుతో ఓటమి చెందారు. దీంతో ఒక్క ఓటు విలువ తెలియడంతో ఈసారి సర్పంచ్ అభ్యర్థిగా వెయ్యి రూపాయి బిళ్లలతో నామినేషన్ వేసినట్లు మహేందర్ చెప్పారు.

News November 28, 2025

MHBD: భూమి పేరు మార్పిడికి లంచం డిమాండ్

image

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర తహశీల్దార్ మహేందర్ <<18414245>>లంచం<<>> తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు. పోచంపల్లి పడమటి తండాకు చెందిన రైతు భూక్య బాలు తండ్రి పేరిట ఉన్న 3.09 గుంటల వ్యవసాయ భూమిని తన పేరు మీదకు మార్చడానికి తహశీల్దార్ రూ.25 వేలు డిమాండ్ చేయగా, రూ.15 వేలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సాంబయ్య బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.