News March 8, 2025
బాపట్ల జిల్లాలో క్రీ.శ. 1871 నాటి వివిధ పట్టణాల జనాభా.!

బాపట్ల జిల్లాలో 1871వ సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు మొత్తం జిల్లా జనాభా 15,48,480 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 7,80,588 మంది కాగా మహిళలు 7,67,892 మందిగా నమోదయ్యారు. అప్పటి పట్టణాల వారిగా బాపట్ల-6,086 మంది, చీరాల-9,061మంది, గుంటూరు-19,646 మంది, నిజాంపట్నం-4,128 మంది ఉన్నారు. 1881 సంవత్సరంలో జనాభా గణన ప్రకారం 1871 కన్నా పురుషుల పెరుగుదల శాతం 5.84 కాగా, స్త్రీల పెరుగుదల శాతం 7.42గా ఉంది.
Similar News
News January 23, 2026
SRPT: లక్ష్య సాధనే ధ్యేయంగా చదవాలి: డీఐఈఓ భాను

విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి భాను పిలుపునిచ్చారు. శుక్రవారం సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన తల్లిదండ్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెల్ఫోన్లకు దూరంగా ఉంటూ, క్రమశిక్షణతో చదివి కళాశాలకు పేరు తేవాలన్నారు. మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుని, వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు.
News January 23, 2026
కనేకల్: పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 20 మందికి అస్వస్థత

కనేకల్ మండలం 43 ఉడేగోళం పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనం తిన్న 20 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్కు గురయ్యారు. తిన్న వెంటనే వాంతులు, విరేచనాలు కావడంతో ఉపాధ్యాయులు వారిని కనేకల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనకు గల కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు.
News January 23, 2026
ఈ నెల 27న ‘జన నాయగన్’పై తుది తీర్పు

విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా సెన్సార్ వివాదంపై మద్రాస్ హైకోర్టు ఈ నెల 27న తుది తీర్పు ఇవ్వనుంది. ఇటీవల కోర్టు తీర్పును <<18907956>>రిజర్వ్<<>> చేసిన విషయం తెలిసిందే. చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ CBFC అప్పీల్ దాఖలు చేయడంతో వివాదం చెలరేగింది. డివిజన్ బెంచ్ ఇరుపక్షాల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మూవీ విజయ్ చివరి సినిమా కావడం గమనార్హం.


