News March 6, 2025

బాపట్ల జిల్లాలో భగ్గుమంటున్న ఎండలు

image

బాపట్ల జిల్లాలో మార్చి నెల ప్రారంభంలోనే ఎండలు మండుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో గురువారం 39డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అమృతలూరు, కొల్లూరు, వేమూరు, చుండూరు, చిన్నగంజాం, రేపల్లె, భట్టిప్రోలు మండలాల్లో 39డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యుంది. వేడిగాలులు వీస్తుండడంతో ఇంటర్, 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Similar News

News December 25, 2025

అడ్డతీగల: అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి

image

అడ్డతీగల మండలం కొట్టంపాలెం సమీప జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి అవంతి బస్సు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చెరుకుంపాలెం సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ కె.నవీన్ కుమార్, భార్య బేబీ కళ్యాణి అక్కడికక్కడే మృతి చెందారు. అడ్డతీగల మండలం వేటమామిడి గ్రామంలో జరిగిన క్రిస్టమస్ ప్రార్ధనకు వెళ్లి చెరుకుంపాలెం తిరిగి వస్తుండగా ఎదురుగా అడ్డతీగల వైపు వెళుతున్న బస్సు ఢీకొట్టింది. పోలీసులు విచారిస్తున్నారు.

News December 25, 2025

నేటితో ముగియనున్న సుపరిపాలన యాత్ర

image

AP: మాజీ PM వాజ్‌ పేయి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో చేపట్టిన అటల్-మోదీ సుపరిపాలన యాత్ర నేటితో ముగియనుంది. ఈ నెల 11న ధర్మవరంలో ప్రారంభమైన యాత్రను రాజధాని అమరావతిలో ముగించనున్నారు. ఈ సందర్భంగా అమరావతిలోని అటల్ స్మృతివనంలో 11amకు అటల్ కాంస్య విగ్రహాన్ని CM CBN ఆవిష్కరిస్తారు. BJP ముఖ్యనేతలు హాజరుకానున్నారు. స్మృతివనానికి N4, E4 రోడ్డు జంక్షన్‌లో 2.33ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది.

News December 25, 2025

శివస్వరూపంగా శ్రీనివాసుడు

image

తిరుమల మూలవిరాట్టును పూర్వం విష్ణు రూపమని కొందరు, శైవ రూపమని మరికొందరు భావించారు. స్వామివారి తలపై ఉండే జటలు, కంఠంలోని నాగభూషణాలు చూసి శివుడిగానూ ఆరాధించారు. విగ్రహానికి ఉన్న విలక్షణ లక్షణాలు శివ, కేశవ ఇరువురినీ స్మరింపజేస్తాయి. అందుకే ఇప్పటికీ తిరుమలలో శైవ, వైష్ణవ సంప్రదాయాల మేళవింపు కనిపిస్తుంది. విష్ణుమూర్తి సర్వవ్యాపి అని, ఆయనలో శివుడు కూడా అంతర్భాగమని చెప్పడానికి ఈ రూపం గొప్ప నిదర్శనం.