News March 6, 2025
బాపట్ల జిల్లాలో భగ్గుమంటున్న ఎండలు

బాపట్ల జిల్లాలో మార్చి నెల ప్రారంభంలోనే ఎండలు మండుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో గురువారం 39డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అమృతలూరు, కొల్లూరు, వేమూరు, చుండూరు, చిన్నగంజాం, రేపల్లె, భట్టిప్రోలు మండలాల్లో 39డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యుంది. వేడిగాలులు వీస్తుండడంతో ఇంటర్, 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Similar News
News December 6, 2025
కలెక్టర్ పిలుపు.. ‘3కె రన్ విజయవంతం చేయండి’

భీమవరం పట్టణంలో ట్రాఫిక్పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు 3కె రన్ శనివారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ రన్ బీవీ రాజు సర్కిల్ నుంచి ఉదయం 6:30 గంటలకు ప్రారంభమై జువ్వలపాలెం రోడ్డులోని ఏ.ఎస్.ఆర్ విగ్రహం వరకు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు, వాకర్స్ అసోసియేషన్, అథ్లెటిక్స్, జిల్లా అధికారులు, ప్రజలు పాల్గొనాలని కోరారు.
News December 6, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 6, శనివారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.16 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.33 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.07 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.41 గంటలకు
♦︎ ఇష: రాత్రి 6.58 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News December 6, 2025
MKR: పంచాయతీ ఎన్నికల బరిలో ట్రాన్స్జెండర్

ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన ట్రాన్స్జెండర్ శ్రీప్రేమ గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా తమ గ్రామంలోని 9వ వార్డుకు నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ అభివృద్ధి, శుభ్రత, పేదల సంక్షేమం, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రతి అర్హులైన కుటుంబానికి చేరవేయాలని లక్ష్యంగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రేమ తెలిపారు. ట్రాన్స్జెండర్ అభ్యర్థి నామినేషన్ గ్రామంలో ప్రత్యేక చర్చగా మారింది.


