News March 31, 2025

బాపట్ల జిల్లాలో మాంసం ధరలు ఇలా.!

image

బాపట్ల జిల్లాలో రంజాన్ సందడి మొదలైంది. ముస్లింల పరమ పవిత్రమైన రంజాన్ రోజు మాంసం దుకాణాలు కిటకిటలాడాయి. ప్రజలు భారీ సంఖ్యలో మాంసం విక్రయం కోసం బారులు తీరారు. కాగా జిల్లాలో ప్రాంతాన్ని బట్టి ధరలు అటూ ఇటుగా ఉన్నాయి. బ్రాయిలర్ కోడి KG రూ.280 ఉండగా.. మటన్ కిలో ధర 800, నాటుకోడి ధర KG రూ.500గా ఉంది. నిన్న బాపట్ల సహా పలు ప్రాంతాల్లో KG రూ.180 ఉన్న చికెన్ ధర నేడు అమాంతం రూ.100కు పెరిగింది.

Similar News

News November 15, 2025

ECపై ఆరోపణలను కొట్టిపారేయలేం: స్టాలిన్

image

బిహార్ ఎన్నికల్లో విజయం సాధించిన నితీశ్ కుమార్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు RJD నేత తేజస్వీ యాదవ్ క్యాంపైన్ చేసిన తీరును మెచ్చుకున్నారు. ‘ఈ ఫలితాల నుంచి ఇండీ కూటమి నేతలు ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. అలాగే ఈ ఫలితాలతో ఎన్నికల సంఘంపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేయలేం. పౌరులు మరింత పారదర్శక ఎన్నికల సంఘానికి అర్హులు’ అని తెలిపారు.

News November 15, 2025

అమ్రాబాద్: పులుల లెక్కింపునకు వాలంటీర్ల ఆసక్తి

image

కవ్వాల్, అమ్రాబాద్, వికారాబాద్ రిజర్వ్ ఫారెస్ట్‌లలో అటవీశాఖ చేపట్టిన పులుల లెక్కింపునకు వాలంటీర్ల నుంచి భారీ స్పందన వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,620 మంది స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అత్యధిక మంది వాలంటీర్లు ముఖ్యంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారని అటవీశాఖ అధికారులు తెలిపారు.

News November 15, 2025

విశాఖలో రెండో రోజు CII సమ్మిట్

image

విశాఖలో CII సమ్మిట్ నేటితో ముగియనుంది. నిన్న సుమారు 400 MOUలు జరగ్గా.. నేడు గూగుల్, శ్రీ సిటీ, రేమండ్, ఇండోసోల్ వంటి ప్రాజెక్టుల శంకుస్థాపనలు చేయనున్నారు. న్యూజిలాండ్, జపాన్, కెనడా, మెక్సికో ప్రతినిధులతో CM చంద్రబాబు భేటీ కానున్నారు. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, సస్టైనబుల్ సిటీస్, ‘ఆంధ్ర టూరిజం విజన్’ సెషన్లు చేపట్టనున్నారు. మంత్రి లోకేశ్ అధ్యక్షతన ‘AI అండ్ ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్’పై ముఖ్య చర్చ జరగనుంది.