News March 27, 2025

బాపట్ల జిల్లాలో ముమ్మరంగా వాహన తనిఖీలు

image

బాపట్ల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. గురువారం బాపట్ల జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహించి వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. వాహనాలలో నిషేధిత వస్తువులు తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News November 19, 2025

సంగారెడ్డి: వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి: కలెక్టర్

image

వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. వయోవృద్ధుల వారోత్సవాల సందర్భంగా కలెక్టరేట్‌లో బుధవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వయోవృద్ధులు విజ్ఞాన భాండాగారాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి పాల్గొన్నారు.

News November 19, 2025

హిడ్మా అనుచరుడు సరోజ్ అరెస్టు!

image

AP: మావోయిస్టు అగ్రనేత హిడ్మా నిన్న ఉదయం మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోవడం తెలిసిందే. అయితే ఆయన అనుచరుడు మద్వి సరోజ్‌ కోనసీమ(D) రావులపాలెంలో ఉన్నట్లు తెలియడంతో పోలీసులు గాలింపు చేపట్టి ఈరోజు అరెస్టు చేశారు. రహస్య ప్రాంతంలో ఆయన్ను విచారిస్తున్నారని సమాచారం. కాగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన సరోజ్ రావులపాలెం ఎందుకు వచ్చాడు? ఎప్పటినుంచి ఉంటున్నాడు? తదితరాలపై ఆరా తీస్తున్నారు.

News November 19, 2025

ఈ ఏడాది 328 రోడ్డు ప్రమాదాల్లో మరణాలు: సీపీ

image

ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఏడాది నవంబర్ 18వ తేదీ వరకు వ్యక్తుల మరణాలకు సంబంధించిన రోడ్డు ప్రమాదాలు 328 జరిగాయని పోలీసు కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు తెలిపారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 92 ప్రమాదాలు తక్కువగా జరిగాయని ఆయన వివరించారు. నందిగామలోని అనాసాగరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటన నేపథ్యంలో కమిషనర్ ఈ వివరాలను వెల్లడించారు.