News March 27, 2025
బాపట్ల జిల్లాలో ముమ్మరంగా వాహన తనిఖీలు

బాపట్ల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. గురువారం బాపట్ల జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహించి వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. వాహనాలలో నిషేధిత వస్తువులు తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News November 24, 2025
కేయూ: ఫీజుకు డిసెంబర్ 3 వరకు గడువు

కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని పీజీ ఎంఏ, ఎంమ్కాం, ఎంఎస్సీ, ఎంటీఎం, ఎంహెచ్ఆర్ఎం, ఎంఎస్సీ డబ్ల్యూ కోర్సుల మూడో సెమిస్టర్ (రెగ్యులర్/ఎక్స్/ఇంప్రూవ్మెంట్) పరీక్షల ఫీజు చెల్లించడానికి డిసెంబర్ 3 వరకు అపరాధ రుసుము లేకుండా గడువు ఉందని పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ తెలిపారు. రూ.250 అపరాధ రుసుంతో డిసెంబర్ 6 వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
News November 24, 2025
పుట్టపర్తిలో సినీ నటి సాయి పల్లవి

ప్రముఖ సినీ నటి, శ్రీ సత్యసాయి బాబా భక్తురాలు సాయి పల్లవి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం ఆమె ప్రశాంతి నిలయంలోని సత్యసాయి మహా సమాధిని దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం హిల్ వ్యూ స్టేడియంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. బాబా జీవిత చరిత్రపై ప్రదర్శించిన లేజర్ షోను వీక్షించారు. సంప్రదాయ చీరకట్టులో సాయిపల్లవి ఆకట్టుకున్నారు.
News November 24, 2025
విశాఖ-మహబూబ్నగర్ రైలులో చోరీ

విశాఖ-మహబూబ్నగర్ ఎక్స్ప్రెస్ రైలులోని ఏ-2 కోచ్లో 20 తులాల బంగారం చోరీకి గురైనట్టు బాధితులు జీఆర్పీకి ఫిర్యాదు చేశారు. విశాఖకు చెందిన శారదాంబ, చిన్నమ్నాయుడు దంపతులు రాత్రి నిద్రలో ఉండగా బ్యాగులోని బంగారం మాయమైంది. కాజీపేటకు రాగానే చోరీ విషయం గుర్తించారు. కాచిగూడలో చేసిన ఫిర్యాదు కాజీపేట జీఆర్పీకి బదిలీ అయిందని సీఐ నరేశ్ కుమార్ తెలిపారు.


