News March 27, 2025
బాపట్ల జిల్లాలో ముమ్మరంగా వాహన తనిఖీలు

బాపట్ల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. గురువారం బాపట్ల జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహించి వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. వాహనాలలో నిషేధిత వస్తువులు తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News January 9, 2026
కామారెడ్డిలో దొంగల బీభత్సం

కామారెడ్డిలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకేసారి ఐదు దుకాణాల తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడిన దుండగులు.. నగదుతో పాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో శుక్రవారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. చోరీ జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. పోలీసులు నిఘా పెంచాలని, రాత్రిపూట గస్తీ ముమ్మరం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
News January 9, 2026
‘రథసప్తమి’కి అంకురార్పణ

సూర్య భగవానుడి జన్మదినోత్సవమైన రథసప్తమి వేడుకలను ఈ ఏడాది ఏడు రోజుల పాటు రాష్ట్ర పండుగగా వైభవంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శుక్రవారం ఉదయం అరసవల్లి దేవస్థాన ప్రాంగణంలో ‘కర్టెన్ రైజర్’ కార్యక్రమంతో రథసప్తమి ఉత్సవాలకు అధికారికంగా అంకురార్పణ చేశారు. జనవరి 19 నుంచి 25 వరకు ఏడు రోజుల పాటు విభిన్న కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.
News January 9, 2026
ప్రధానమంత్రితో నేరుగా మాట్లాడే అవకాశం..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో విద్యార్థులు నేరుగా మాట్లాడే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. పరీక్ష పే చర్చ 2026 కార్యక్రమం ద్వారా ఈ అవకాశం పొందవచ్చు. పరీక్షల సమయంలో ఒత్తిడి లేకుండా ఎలా సిద్ధం కావాలనే విషయాలపై ఈ చర్చ నడుస్తుంది. ప్రధాని రాసిన ఎగ్జామ్ వారియర్స్ పుస్తకం తెలుగులో కూడా అందుబాటులో ఉంది.


