News March 26, 2025

బాపట్ల జిల్లాలో యువ రైతు ఆత్మహత్య

image

బాపట్ల జిల్లా బల్లికురవ మండలంలోని కొమ్మినేనివారిపాలెంలో అప్పులు బాధతో యువరైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువ రైతు బ్రహ్మయ్య వ్యవసాయంలో భారీగా అప్పులు కావడంతో, గ్రామంలోని పంట పొలాల్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు అక్కడికి చేరుకొని ఉదయాన్నే పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి వైద్యశాలకు తరలించారు.

Similar News

News December 9, 2025

పార్వతీపురం: జేసీ నాయకత్వంలో రెవిన్యూ సమస్యలన్నీ పరిష్కారం

image

రెవెన్యూ క్లినిక్ పేరుతో జేసీ నాయకత్వంలో రెవెన్యూ సమస్యలకు చెక్ పెట్టినట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్జీదారులు శత శాతం సంతృప్తి చెందినట్లు ఫోన్ కాల్ ద్వారా తెలుసుకున్నట్లు చెప్పారు. ఇది రెవెన్యూ క్లినిక్ అతిపెద్ద విజయమని, ఎవరికైనా సమస్యలు ఉంటే సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News December 9, 2025

గ్లోబల్ సమ్మిట్: ప్రతినిధులకు రిటర్న్ గిఫ్టులు

image

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరైన ప్రతినిధులకు రాష్ట్ర వైభవాన్ని చాటే ప్రత్యేక సావనీర్‌లు(గిఫ్ట్స్) అందించారు. వీటిలో సంప్రదాయ పోచంపల్లి ఇక్కత్ చీర, ముత్యాల నగరానికి ప్రతీకగా ముత్యాల చెవిపోగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే తెలంగాణ కళాకారులు చేతితో చేసిన లక్క గాజులు, సుగంధ సంప్రదాయాన్ని తెలిపే హైదరాబాద్ అత్తర్, రాష్ట్ర వారసత్వ సంస్కృతిని తెలిపే చేర్యాల పెయింటింగ్ చెక్క బొమ్మలు ఉంచారు.

News December 9, 2025

నల్గొండ: పీజీ విద్యార్థులకు గమనిక

image

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో పీజీ (M.A/M.Com/M.Sc/M.S.W) సెమిస్టర్-3 పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు పొడిగించినట్లు కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ డా.ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 15వ తారీకు, అపరాధ రుసుముతో ఈనెల 17వ తారీకు వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.