News April 15, 2025

బాపట్ల జిల్లాలో లాడ్జీలు, హోటళ్లలో తనిఖీలు

image

బాపట్ల జిల్లా వ్యాప్తంగా హోటల్స్, లాడ్జీలు, రిసార్ట్‌లు, దాబాలలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు పోలీసు అధికారులు మంగళవారం తనిఖీలు చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. క్రికెట్ బెట్టింగులు అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. యువతను క్రికెట్ బెట్టింగ్‌కు ప్రోత్సహిస్తే సహించేది లేదని అన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News February 24, 2026

బాపట్ల జిల్లాలో ఉచిత సాఫ్ట్‌వేర్ శిక్షణ

image

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పర్చూరు B.A.R అండ్ T.A జూనియర్ కాలేజీ స్కిల్ హబ్ సెంటర్‌లో జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ కోర్సులో 3 నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా అధికారి మాధవి తెలిపారు. ఇంటర్, డిగ్రీ, బి.టెక్ పూర్తి చేసిన 18-35 ఏళ్ల నిరుద్యోగులు ఈ నెల 28లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. శిక్షణానంతరం ధ్రువపత్రం అందజేస్తారు. వివరాలకు పర్చూరులోని స్కిల్ హబ్ సెంటర్‌‌ను సంప్రదించాలన్నారు.

News February 24, 2026

‘భారత్ టాక్సీ’ లాభాల్లో 80% డ్రైవర్లకే: అమిత్ షా

image

‘భారత్ టాక్సీ’ డ్రైవర్లతో సమావేశమైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ కొత్త ప్లాట్‌ఫామ్ పనితీరుపై క్లారిటీ ఇచ్చారు. ఇతర కంపెనీల్లా లాభాల కోసం కాకుండా డ్రైవర్ల సంక్షేమం కోసమే ప్రభుత్వం ఈ సేవలను ప్రారంభించిందని పేర్కొన్నారు. ఇందులో డ్రైవర్లే యజమానులని, కేవలం ₹500 పెట్టుబడితో చేరొచ్చని తెలిపారు. కంపెనీకి వచ్చే లాభాల్లో 80% నేరుగా డ్రైవర్లకే అందుతుందన్నారు. కమీషన్లు, సర్జ్ ప్రైసింగ్ ఉండవని స్పష్టం చేశారు.

News February 24, 2026

SKLM: గ్రీవెన్స్‌కు భూ ఆక్రమణలు, అక్రమ మైనింగ్‌లపైనే అధిక ఫిర్యాదులు

image

శ్రీకాకుళం జిల్లాలో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌లో అత్యధిక శాతం భూ ఆక్రమణలు, అక్రమ మైనింగ్‌పైనే అర్జీలను ఇచ్చేందుకు స్థానికులు జడ్పీ బాట పట్టారు. అయితే గతంలో వచ్చిన ఫిర్యాదులనే మళ్లీ చేస్తున్నామని, చర్యలు తీసుకోవడంలో అధికారులు జాప్యం వహిస్తున్నారని పోలాకి జడ్పీటీసీ చైతన్య కలెక్టర్‌కు స్వప్నిల్ దిన్‌కర్ పుండ్కర్‌కు విన్నవించడం గమనార్హం. అత్యధికంగా నరసన్నపేటలో భూ సమస్యలపై ఫిర్యాదులొచ్చాయి.