News January 29, 2025
‘బాపట్ల జిల్లాలో 2024లో 226 మంది చనిపోయారు’

గత 2024 సంవత్సరంలో బాపట్ల జిల్లాలో జరిగిన 500కు పైగా ప్రమాదాలలో సుమారు 226 మంది చనిపోయారని బాపట్ల మోటారు వాహన తనిఖీ అధికారి ప్రసన్న కుమారి చెప్పారు. బుధవారం రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా బాపట్లలోని డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ గ్రౌండ్లో వాహన దారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం వలన ప్రమాదాలలో రక్షణ లభిస్తుందన్నారు. సహాయ అధికారి కిషోర్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News October 30, 2025
నిర్మల్: నవంబర్ 4న జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు

నవంబర్ 4 నుంచి జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు నిర్వహించనున్నారు. జానపద నృత్యం, పాటలు(బృందం) కవిత్వం, వ్యాసరచన, ఉపన్యాసం (హిందీ,ఇంగ్లీష్,తెలుగు) పెయింటింగ్, ఇన్నోవేషన్ ట్రాక్, తదితర అంశాలలో పోటీలు నిర్వహించనున్నారు. నవంబర్ 4న 15 నుంచి 29 సంవత్సరాల వయస్సు గల వారు తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల సోఫీ నగర్లో హాజరు కావాలని సూచించారు. ప్రథమ స్థానంలో నిలిచినవారిని రాష్ట్రస్థాయికి పంపనున్నారు.
News October 30, 2025
TU: గెస్ట్ ఫ్యాకల్టీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు

తెలంగాణ విశ్వవిద్యాలయంలోని లా కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగా చేరడానికి నియామక చేపట్టినట్లు లా కళాశాల ప్రిన్సిపల్ ప్రసన్నరాణి తెలిపారు. LLM/ML లేదా సరిసమాన విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. నవంబర్ 1న మధ్యాహ్నం 2 గంటలకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా కాలేజీలో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్లో సందర్శించాలన్నారు.
News October 30, 2025
కాగజ్నగర్: సైబర్ నేరగాడి అరెస్ట్

కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఆన్ లైన్ ద్వారా రూ.45790 పోగొట్టుకొని ఫిర్యాదు చేసినట్లు CI కుమారస్వామి తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు D-4C బృందం ద్వారా సాంకేతిక ఆధారాలను సేకరించి MPకి చెందిన ఆశిష్ కుమార్ దోహార్ను పట్టకున్నారు. అతడి ఖాతాలోని రూ.34537.38 ఫ్రీజ్ చేసినట్లు CI వెల్లడించారు.


