News January 29, 2025

‘బాపట్ల జిల్లాలో 2024లో 226 మంది చనిపోయారు’

image

గత 2024 సంవత్సరంలో బాపట్ల జిల్లాలో జరిగిన 500కు పైగా ప్రమాదాలలో సుమారు 226 మంది చనిపోయారని బాపట్ల మోటారు వాహన తనిఖీ అధికారి ప్రసన్న కుమారి చెప్పారు. బుధవారం రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా బాపట్లలోని డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ గ్రౌండ్‌లో వాహన దారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం వలన ప్రమాదాలలో రక్షణ లభిస్తుందన్నారు. సహాయ అధికారి కిషోర్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News September 18, 2025

ఈసీఐఎల్‌లో 160 ఉద్యోగాలు

image

హైదరాబాద్‌లోని <>ECIL<<>> 160 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 22వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. బీఈ/బీటెక్‌లో కనీసం 60% మార్కులతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 30ఏళ్లు. సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

News September 18, 2025

గుంతకల్లుకు నటి నిధి అగర్వాల్

image

ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్ ఈ నెల 22న గుంతకల్లుకు రానున్నారు. ఓ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించడానికి ఆమె రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక ఇటీవల విడుదలైన ‘హరిహర వీరమల్లు’లో నటించిన ఆమె ప్రస్తుతం ‘ది రాజాసాబ్‌’ మూవీలో ప్రభాస్ సరసన నటిస్తున్నారు.

News September 18, 2025

ASF: ‘అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలి’

image

జిల్లాలో అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షలు నిర్వహించాలని అదనపు కలెక్టర్, ఉమ్మడి జిల్లా పరీక్షల బోర్డు ఛైర్మన్ దీపక్ తివారి అన్నారు. బుధవారం ASF కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు సమావేశానికి హాజరయ్యారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షలు నిర్వహించాలని, సీసీఈ నివేదికలు నిర్వహించాలని తెలిపారు.