News February 27, 2025

బాపట్ల జిల్లాలో 29.29 శాతం పోలింగ్

image

బాపట్ల జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 24,493 ఓటర్లు ఉన్నారు. ఉదయం 10 గంటలకు 4,787 మంది పురుషులు, 2,386 మంది ఓటు వేశారని జిల్లా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి జి.గంగాధర్ గౌడ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం 12 గంటల వరకు 29.29 శాతం పోలింగ్ జరిగిందన్నారు.

Similar News

News November 10, 2025

‘వెంటనే తొలగిస్తున్నాం’.. CEO సహా ఉద్యోగులకు HR మెయిల్!

image

HR డిపార్ట్‌మెంట్ చేసిన పొరపాటు గురించి ఓ ఉద్యోగి చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘మా కంపెనీ ఆఫ్‌బోర్డింగ్ ఆటోమేషన్ టూల్‌ను టెస్ట్ చేస్తోంది. లైవ్ మోడ్ నుంచి టెస్ట్ మోడ్‌కు మార్చడాన్ని మర్చిపోయింది. దీంతో ‘మీ చివరి పని దినం వెంటనే అమల్లోకి వస్తుంది’ అని CEO సహా 300 మందికి ఈమెయిల్స్ వచ్చాయి. అయితే తప్పు తెలుసుకుని తర్వాత మరో మెసేజ్ చేసింది. ఎవరినీ తొలగించలేదని చెప్పింది’ అని రెడిట్‌లో రాసుకొచ్చాడు.

News November 10, 2025

ములుగు గజ గజ.. పడిపోయిన ఉష్ణోగ్రతలు

image

అకాల వర్షాలతో ఆగమైన ప్రజలకు చలి రూపంలో మరో విపత్తు ఎదురవుతోంది. రేపటి నుంచి పది రోజులపాటు ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పగలు, రాత్రి సమయాల్లో 10-14 డిగ్రీలు పడిపోతుందని పేర్కొంది. ఈరోజు నుంచే ములుగు ఏజెన్సీలో చలి ప్రభావం మొదలైంది. ఉదయం బారేడు పొద్దెక్కినా ఎక్కిన చలి ప్రభావం తగ్గలేదు. గోదావరి పరివాహక అటవీ మండలాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండనుంది.

News November 10, 2025

ఐక్యత పాదయాత్రను విజయవంతం చేయాలి: కలెక్టర్

image

ములుగు జిల్లా కేంద్రంలో ఈనెల 11 నిర్వహించే సర్దార్ ఏ-150 ఐక్యత పాదయాత్రను విజయవంతం చేయాలని కలెక్టర్ దివాకర్ టీఎస్ పిలుపునిచ్చారు. కేంద్ర యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఫారెస్ట్ కార్యాలయం వద్ద ఉదయం 9:30 గంటలకు ఈ పాదయాత్ర ప్రారంభమవుతుంది. జిల్లాలోని విద్యార్థులు, యువత, వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కలెక్టర్ కోరారు.