News February 27, 2025
బాపట్ల జిల్లాలో 70.78% పోలింగ్ నమోదు

బాపట్ల జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం 4 గంటలకు వరకు 70.78శాతం పోలింగ్ నమోదైనట్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి గంగాధర్ తెలిపారు. చుండూరు మండలంలో 66.46, అమృతలూరు 74.40, వేమూరు 72, కొల్లూరు 63.33, భట్టిప్రోలు 66.43, చెరుకుపల్లి 72.88, నగరం 63.51, రేపల్లె 67.76, నిజాంపట్నం 68.89, పిట్టలవానిపాలెం 68.88, కర్లపాలెం 71.70, బాపట్ల మండలంలో 71.70శాతం ఓటింగ్ జరిగింది.
Similar News
News February 28, 2025
సిద్దిపేట: 2019లో 59.03%.. 2025లో 70.42%

ఉమ్మడి MDK- KNR- NZB- ADB పట్టభద్రులు, ఉపాధ్యాయ MLC ఎన్నికల పోలింగ్ నిన్న జరగగా.. మార్చి 3న కరీంనగర్లో లెక్కింపు జరగనుంది. అయితే, 2019లో పట్టభద్రుల పోలింగ్ 59.03శాతం నమోదు కాగా, 2025లో 70.42 శాతం నమోదైంది. ఉపాధ్యాయ పోలింగ్ 2019లో 83.54శాతం నమోదు కాగా, 2025లో 91.90శాతం పోలింగ్ జరిగింది. 2019 ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రులు 11.39శాతం, టీచర్ల ఓటింగ్ 8.36 శాతం పెరిగింది.
News February 28, 2025
భువనగిరి: జిల్లాలో 96.54 శాతం పోలింగ్ నమోదు

వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 984 ఓటర్లుండగా.. 96.54 పోలింగ్ శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ హనుమంతరావు జిల్లా వ్యాప్తంగా పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. బ్యాలెట్ బాక్స్లను సీజ్ చేసి నల్గొండ జిల్లా కేంద్రానికి తరలించనున్నారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.
News February 28, 2025
బాపట్ల: మైనర్ బాలికపై అత్యాచారం

బాపట్ల జిల్లా నగరం మండలంలోని ఓ గ్రామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై 17 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నగరం ఎస్ఐ బండ్ల భార్గవ్ వివరాల ప్రకారం.. ఈనెల 25న ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని బలవంతంగా దగ్గరలో ఉన్న స్కూల్ బస్సులోకి లాక్కొని వెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు అతడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.