News January 30, 2025

బాపట్ల జిల్లాలో MLC ఎన్నికలు

image

బాపట్ల జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది.
* ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్.
* 10వ తేదీ వరకు నామినేషన్ల దాఖలు.
* 11న నామినేషన్ల పరిశీలన.
* 13న నామినేషన్ల ఉపసంహరణ.
* 27న ఉదయం 8.నుంచి సాయంత్రం 4 గంటలకు పోలింగ్.
* మార్చి 3న ఓట్ల లెక్కింపు.
మరోసారి MLC అభ్యర్థిగా KS లక్ష్మనరావు, కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌తోపాటు మరికొందరు స్వతంత్ర అభ్యర్థులు పోటీకి సిద్దమయ్యారు.

Similar News

News October 26, 2025

HYD: రేపు ‘లక్కీ’గా వైన్స్ దక్కేదెవరికి?

image

మద్యం షాపుల టెండర్లకు TG ఎక్సైజ్ శాఖ అధికారులు రేపు లక్కీ డ్రా తీయనున్నారు. HYDలో ఈసారి 80 లిక్కర్ షాపులకు 3201 దరఖాస్తులు వచ్చాయి. సికింద్రాబాద్‌లో 99 షాపులకు 3022 మంది దరఖాస్తు చేశారు. జంటనగరాల నుంచి రూ.186.69 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. గ్రేటర్‌ పరిధిలోని 639 షాపులకు 34,958 దరఖాస్తులు రాగా.. రూ.1048.74 కోట్ల ఆదాయం రావడం విశేషం. రేపటి లక్కీ డ్రాలో అదృష్టం ఎవరిని వరించనుందో చూడాలి.

News October 26, 2025

సెలవు రోజులలో పాఠశాలలో తెరిస్తే కఠిన చర్యలు: DEO

image

మొంథా తుపాను నేపథ్యంలో జిల్లాలోని అన్ని పాఠశాలలకు 27, 28 తేదీలలో 2 రోజులు సెలవులు ప్రకటించినట్లు DEO కంది వాసుదేవరావు ప్రకటించారు. తుపాన్ నేపథ్యంలో ప్రజలకు అవసరమైతే పునరావాసం కోసం HMలు అందుబాటులో ఉండి పాఠశాల భవనాలు ఇవ్వాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. సెలవు దినాలలో రూల్స్ బ్రేక్ చేస్తూ పాఠశాలలు తెరిచిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని DEO హెచ్చరించారు.

News October 26, 2025

నిడిగొండ త్రికూట ఆలయాన్ని సందర్శించిన హెరిటేజ్ బృందం

image

రఘునాథపల్లి మండలం నిడిగొండలోని త్రికూట ఆలయాన్ని ‘హైదరాబాద్ హెరిటేజ్ వాక్’ మిత్ర బృందం సభ్యులు ఆదివారం సందర్శించారు. స్థానిక శివాలయం, ఇతర చారిత్రక ప్రదేశాల ప్రాముఖ్యతను ఆలయ పూజారి కృష్ణమాచార్యులు వారికి వివరించారు. అంతకుముందు జనగామ మండలం పెంబర్తిలోని హస్త కళలను సందర్శించి, అక్కడ వర్క్‌షాపు నిర్వహించారు.