News January 30, 2025

బాపట్ల జిల్లాలో MLC ఎన్నికలు

image

బాపట్ల జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది.
* ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్.
* 10వ తేదీ వరకు నామినేషన్ల దాఖలు.
* 11న నామినేషన్ల పరిశీలన.
* 13న నామినేషన్ల ఉపసంహరణ.
* 27న ఉదయం 8.నుంచి సాయంత్రం 4 గంటలకు పోలింగ్.
* మార్చి 3న ఓట్ల లెక్కింపు.
మరోసారి MLC అభ్యర్థిగా KS లక్ష్మనరావు, కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌తోపాటు మరికొందరు స్వతంత్ర అభ్యర్థులు పోటీకి సిద్దమయ్యారు.

Similar News

News December 8, 2025

టెట్‌ అభ్యర్థులకు 10 నుంచి పరీక్షలు

image

టెట్‌‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 10 నుంచి 21వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ వాసుదేవరావు తెలిపారు. రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్‌లో రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.

News December 8, 2025

CBSE తరహాలో టెన్త్ ఎగ్జామ్స్?.. షెడ్యూల్‌పై ఉత్కంఠ

image

TG: CBSE తరహాలో పిల్లలపై ఒత్తిడి తగ్గించేందుకు ఈసారి SSC పరీక్షల్లో ఒక్కో పేపర్‌కు 2, 3 రోజులు గ్యాప్‌ ఉంచి 2 రకాల షెడ్యూళ్లను CMOకు పంపారు. మధ్యలో రంజాన్, ఉగాది, మహవీర్ జయంతి, శ్రీరామ నవమి ఉండడంతో 4 రోజుల వ్యవధీ ఉండనుంది. ఈ ప్రతిపాదనలపై CM నిర్ణయం తీసుకోకపోవడంతో పరీక్ష తేదీలపై ఉత్కంఠ నెలకొంది. ఇంటర్ షెడ్యూల్ వెలువడిన వారంలోగా టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రావాల్సి ఉండగా నెలరోజులవుతున్నా తేలలేదు.

News December 8, 2025

ప్రధాని ప్రసంగంలో నిజాలు కరవయ్యాయి: ప్రియాంకా గాంధీ

image

ముఖ్యమైన సమస్యల నుంచి డైవర్ట్ చేయడానికే వందేమాతరంపై చర్చ అని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ విమర్శించారు. ‘వందేమాతరం కేవలం గేయం కాదు అది ప్రజల గొంతుక. ప్రధాని ప్రసంగంలో నిజాలు కరవయ్యాయి. వేల మంది మరణిస్తున్నారు. త్వరలో బెంగాల్‌లో ఎన్నికలు ఉన్నాయి. వాటిపై చర్చను వదిలేసి ఈ సమయంలో జాతీయ గేయంపై చర్చ అవసరమా?’ అని లోక్‌సభలో ప్రియాంక పేర్కొన్నారు.