News April 7, 2025

బాపట్ల జిల్లా అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ నియామకం

image

బాపట్ల జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లా న్యాయస్థానంలో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా గవిని శ్రీనివాసరావు నియమితులయ్యారు. సోమవారం బాపట్ల కోర్టు భవనంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తన నియమాక పత్రాలను ఆరో అదనపు కోర్టు జడ్జ్ శ్యాం బాబుకు అందజేశారు. ఈ సందర్భంగా నూతన ఏపీపీని బాపట్ల బార్ అసోసియేషన్ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేసి స్వాగతం పలికారు.

Similar News

News October 31, 2025

ఉమ్మడి కృష్ణా జిల్లాలో 65,362 హెక్టార్లలో పంట నష్టం

image

మెుంథా తుఫాన్ కారణంగా అన్నదాతకు అపార నష్టం వాటిల్లింది. ప్రాథమిక అంచనా ప్రకారం.. 65,362 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. సుమారు 74వేల మంది రైతుల పొలాలు దెబ్బతిన్నాయి. కృష్ణా (D) 46,357 హెక్టార్లలో నష్టం. వరి 45వేల హెక్టార్లు, మినుము 985 హెక్టార్లు, వేరుశనగ 288 హెక్టార్లు, పత్తి 48 హెక్టార్లు. NTR (D) 19,005 హెక్టార్లలో నష్టం. పత్తి 10వేల హెక్టార్లు, వరి 6వేల హెక్టార్లు.

News October 31, 2025

అనర్హత పిటిషన్లపై విచారణకు గడువు కోరిన స్పీకర్

image

MLAల అనర్హత పిటిషన్లపై విచారణకు మరో 2 నెలలు గడువు కావాలని TG స్పీకర్ G ప్రసాద్ కుమార్ సుప్రీంకోర్టుకు విన్నవించారు.10 మంది MLAలకు నోటీసులివ్వగా 8 మంది స్పందించారు. వీరిలో 4గురి విచారణ ముగిసింది. SC విధించిన గడువు నేటితో ముగియడంతో మిగతా వారి విచారణకు సమయం కావాలని స్పీకర్ తరఫు న్యాయవాదులు కోరారు. నోటీసులకు స్పందించని ఇద్దరిపైనా స్పీకర్ నిర్ణయం తీసుకోవలసి ఉంది. కాగా కోర్టు ఆదేశాలపై ఉత్కంఠ నెలకొంది.

News October 31, 2025

GNT: తప్పుడు ప్రచారాలపై పోలీస్ దృష్టి

image

సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, పోలీసులపై తప్పుడు పోస్టులు పెరగడంతో గుంటూరు పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించనుంది. వాట్సాప్ గ్రూపుల్లో అధికారులను సభ్యులుగా చేర్చి బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్న ఘటనలపై ఫిర్యాదులు రావడంతో 15 గ్రూపులను గుర్తించారు. తొలి దశలో 10 గ్రూప్ అడ్మిన్‌లకు నోటీసులు జారీ చేశారు. లాలాపేట, నగరంపాలెం, అరండల్‌పేట, పొన్నూరు, పెదకాకానిలో నివసించే అడ్మిన్‌లను విచారణకు పిలిపించారు.