News January 26, 2025
బాపట్ల జిల్లా ఉత్తమ ప్రభుత్వ ఉద్యోగిగా రాజేశ్

బాపట్ల జిల్లా ఉత్తమ ప్రభుత్వ ఉద్యోగిగా జిల్లా మైన్స్, జియాలజీ అధికారి రాజేశ్ కుమార్ అవార్డు అందుకున్నారు. బాపట్లలో ఆదివారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కలెక్టర్ వెంకట మురళి చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. విధులలో ఉత్తమ పనితీరు కనబర్చడంతో బాపట్ల జిల్లాలో మూడవసారి ఉత్తమ ప్రభుత్వ ఉద్యోగి అవార్డు అందుకున్నట్లు రాజేశ్ తెలిపారు.
Similar News
News November 19, 2025
సినిమా అప్డేట్స్

* విక్రమ్ కుమార్ డైరెక్షన్లో నితిన్ ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రంలో నటిస్తారని సమాచారం. వీరి కాంబోలో వచ్చిన ‘ఇష్క్’ సూపర్ హిట్టయిన విషయం తెలిసిందే.
* సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ చిత్రంలో నటిస్తారని టాక్. ఇందులో మిలిటరీ ఆఫీసర్ పాత్రలో పవర్ స్టార్ కనిపిస్తారని సమాచారం.
* జూనియర్ ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమా తర్వాతి షెడ్యూల్ డిసెంబర్లో శ్రీలంకలో జరుగుతుందని సినీ వర్గాలు వెల్లడించాయి.
News November 19, 2025
సిద్దిపేట: CP పనితీరుపై ప్రశంసల జల్లు

సీపీ విజయ్ కుమార్ పనితీరుపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అక్టోబర్లో సీపీగా బాధ్యతలు తీసుకున్న ఆయన ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నారు. తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాల గురించి సామాన్య రైతుతో అవగాహన కల్పించి అందరి మన్ననలు పొందారు. తాగి డ్రైవింగ్ చేసి పట్టుపడితే రూ.10 జరిమానా నిబంధనలకు సైతం మద్దతు లభించింది. సుభాష్ రోడ్, మార్కెట్ రద్దీకి చెక్ పెట్టారు.
News November 19, 2025
హసీనాకు మరణశిక్ష.. కుమారుడి స్పందనిదే..

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు <<18311087>>మరణశిక్ష<<>> విధిస్తూ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ తీసుకున్న నిర్ణయంపై ఆమె కుమారుడు సాజిబ్ వాజీద్ స్పందించారు. కేసుల విచారణలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం న్యాయ ప్రక్రియను పాటించలేదని ఆరోపించారు. బంగ్లాదేశ్లో ప్రభుత్వ మార్పుకు జో బైడెన్ సర్కారు మిలియన్ డాలర్లు వెచ్చించిందని విమర్శించారు. అయితే, ట్రంప్ ప్రభుత్వ వైఖరి వేరుగా ఉందని సాజిబ్ అభిప్రాయపడ్డారు.


