News January 26, 2025

బాపట్ల జిల్లా ఉత్తమ ప్రభుత్వ ఉద్యోగిగా రాజేశ్

image

బాపట్ల జిల్లా ఉత్తమ ప్రభుత్వ ఉద్యోగిగా జిల్లా మైన్స్, జియాలజీ అధికారి రాజేశ్ కుమార్ అవార్డు అందుకున్నారు. బాపట్లలో ఆదివారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కలెక్టర్ వెంకట మురళి చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. విధులలో ఉత్తమ పనితీరు కనబర్చడంతో బాపట్ల జిల్లాలో మూడవసారి ఉత్తమ ప్రభుత్వ ఉద్యోగి అవార్డు అందుకున్నట్లు రాజేశ్ తెలిపారు.

Similar News

News November 17, 2025

చలి పెరిగింది గురూ.. జాగ్రత్తగా ప్రయాణించు.!

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2 రోజులుగా చలి తీవ్రత పెరుగుతోంది. సాయత్రం నుంచే చలిగాలు పెరగడంతోపాటు, ఉదయానికి చలి తీవ్రత మరింతగా పెరుగుతోంది. నేడు గుంటూరు జిల్లాలో కనీస ఉష్ణోగ్రత 17°సె.గా రికార్డ్ కావడంతో ప్రజలు చలి దుస్తులు ఉపయోగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజామున రహదారులు మంచుతో కప్పబడి ఉండటంతో ప్రయాణాలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. తెల్లవారిన తర్వాతే ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.

News November 17, 2025

చలి పెరిగింది గురూ.. జాగ్రత్తగా ప్రయాణించు.!

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2 రోజులుగా చలి తీవ్రత పెరుగుతోంది. సాయత్రం నుంచే చలిగాలు పెరగడంతోపాటు, ఉదయానికి చలి తీవ్రత మరింతగా పెరుగుతోంది. నేడు గుంటూరు జిల్లాలో కనీస ఉష్ణోగ్రత 17°సె.గా రికార్డ్ కావడంతో ప్రజలు చలి దుస్తులు ఉపయోగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజామున రహదారులు మంచుతో కప్పబడి ఉండటంతో ప్రయాణాలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. తెల్లవారిన తర్వాతే ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.

News November 17, 2025

ఒక్క ప్రాజెక్టు తెచ్చినట్టు నిరూపించినా రాజీనామా చేస్తా: గంటా

image

వైసీపీ హయాంలో మొదలు పెట్టి, పూర్తి చేసి ప్రారంభించిన ఒక్క ప్రాజెక్టు చూపించినా తన పదవికి రాజీనామా చేస్తానని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సవాల్ చేశారు. ఎంవీపీ కాలనీ క్యాంపు కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన అయిదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కియా వంటి చెప్పుకోదగ్గ ఒక్క కంపెనీని కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయిందని మండిపడ్డారు.