News March 21, 2025
బాపట్ల జిల్లా గీతాన్ని పాడాలని సింగర్ మనోను కోరిన కలెక్టర్

బాపట్ల జిల్లా గీతాన్ని పాడాలని జిల్లా కలెక్టర్ జె .వెంకట మురళి చేసిన విజ్ఞప్తి మేరకు ప్రముఖ గాయకులు (మనో)నాగుర్ బాబు శుక్రవారం జిల్లా కలెక్టర్ను కలిశారు. చందోలు బంగ్లాముఖి దేవాలయానికి వెళ్తూ మార్గమధ్యలో ఆయన కలెక్టర్ ను కలిశారు. వారిరువురూ 10 నిమిషాల పాటు జిల్లా గీతంపై చర్చించుకున్నారు. కలెక్టర్ కోరిక మేరకు బాపట్ల జిల్లా గీతాన్ని ఆలపించడానికి మనో అంగీకరించారు.
Similar News
News November 16, 2025
బిర్సా ముండా జయంతి.. సిరిసిల్లలో బీజేపీ నివాళులు

బిర్సా ముండా జయంతి సందర్భంగా బీజేపీ పట్టణ కమిటీ అత్యవసర సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించింది. గిరిజన హక్కుల కోసం పోరాడిన బిర్సా ముండా చిత్రపటానికి నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు ధూమాల శ్రీకాంత్ మాట్లాడుతూ.. బిర్సా ముండా పోరాటం గిరిజన సమాజానికి దీపస్తంభం లాంటిదని, గిరిజన సంక్షేమం కోసం బీజేపీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
News November 16, 2025
సిరిసిల్ల: టీకా కేంద్రాలను తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ రజిత

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం. రజిత శనివారం ఆకస్మికంగా అంబేద్కర్ నగర్, శాంతినగర్లలోని టీకా కేంద్రాలను తనిఖీ చేశారు. కోల్డ్ చెయిన్ నిల్వలు, రికార్డులు, ఐస్ ప్యాక్స్ను పరిశీలించి, సక్రమ నిర్వహణకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 0-5 ఏళ్ల పిల్లలందరికీ సకాలంలో టీకాలు అందించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఈ తనిఖీలో డాక్టర్ సంపత్ కుమార్, నవీన్ పాల్గొన్నారు.
News November 16, 2025
ఎల్లారెడ్డిపేట: ‘పదో తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించాలి’

పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి వినోద్ అన్నారు. శనివారం ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ ప్రభుత్వ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించిన అనంతరం విద్యార్థులు తింటున్న మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. ప్రతి విద్యార్థి పట్టుదలతో చదువుకోవాలని ఆయన సూచించారు.


