News April 15, 2025

బాపట్ల జిల్లా డీఆర్డీఏ ఇన్‌ఛార్జి పీడీ నియామకం

image

బాపట్ల జిల్లా డీఆర్డీఏ ఇన్‌ఛార్జి పీడీగా సుబ్బారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బాపట్ల జిల్లా డీఆర్డీఏ పీడీగా కొనసాగుతున్న శ్రీనివాస్ ట్రైనింగ్ నిమిత్తం వారం రోజులు సెలవు పై వెళ్ళారు. ఆయన స్థానంలో ఇన్‌ఛార్జి పీడీగా సుబ్బారావును నియమిస్తూ బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.

Similar News

News December 7, 2025

10వ తేదీ నుంచి జిల్లా టెట్ పరీక్షలు: డీఈవో

image

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించడానికి అన్నీ ఏర్పాట్లును చేసిందని డీఈవో శామ్యూల్ పాల్ తెలిపారు. ఈ నెల 10 తేదీ నుంచి 21 వరకు జిల్లాలో 5 పరీక్ష కేంద్రాలలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కర్నూలులో 3, ఆదోని,ఎమ్మిగనూరులో 1 చొప్పున పరీక్షా ఏర్పాటు చేశారు. వీటితోపాటు హైదరాబాద్‌లో ఐదు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 39,485 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారు.

News December 7, 2025

నంద్యాలలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్

image

నంద్యాల జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ప్రజల రక్షణ, భద్రతకు భరోసా కల్పించేందుకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ ఉపయోగ పడుతుందన్నారు. నంద్యాల MS నగర్, VC కాలనీ, బ్రాహ్మణ కొట్కూరు పరిధిలోని కోళ్లబవాపురం గ్రామం, పాములపాడు పరిధిలోని మిట్టకందాల గ్రామంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

News December 7, 2025

పొన్నూరులో ఇద్దరు పోలీసులు సస్పెండ్

image

పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న నాగార్జున, మహేష్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం సస్పెండ్ చేశారు. అక్రమ రేషన్ రవాణా కార్యకలాపాలు నిర్వహిస్తున్నవారికి సహకరిస్తూ, పోలీస్ నిఘా సమాచారాన్ని వారికి చేరవేశారని ఎస్పీ తెలిపారు. అక్రమ వ్యాపారస్తులకు సహకరిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.