News March 22, 2025

బాపట్ల జిల్లా పోలీసులకు పురస్కారాల వెల్లువ

image

బాపట్ల జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహించే 12 మంది ఉగాది పురస్కారాలను ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్‌కి ఉత్తమ సేవా పథకం, బాపట్ల డీఎస్పీ రామాంజనేయులుకు మహోన్నత సేవా పథకం, సీసీఎస్ డీఎస్పీ జగదీష్ నాయక్, అడ్మిన్ ఆర్.ఐ మౌలుద్దీన్లకు సేవా పథకాలు, జిల్లాలో 7 గురికి సేవా, ఒకరికి ఉత్తమ సేవా పతకాలు వచ్చాయని ఎస్పీ చెప్పారు.

Similar News

News November 14, 2025

రాహుల్, కేటీఆర్‌ ఐరన్ లెగ్స్: బండి

image

TG: బిహార్ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పని ఖతమైందని, రాహుల్ గాంధీ ఇక పబ్జీ గేమ్‌కే పరిమితమవుతారని మంత్రి బండి సంజయ్ విమర్శించారు. KTR వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి BRS పతనం కొనసాగుతూనే ఉందన్నారు. దేశంలో రాహుల్, TGలో కేటీఆర్ ఐరన్ లెగ్స్ అని బండి ఎద్దేవా చేశారు. దేశం మొత్తం పోటీ చేస్తామని TRSను BRSగా మార్చిన కేసీఆర్ పత్తా లేకుండా పోయారని, చివరకు ఆ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీగా మారిందన్నారు.

News November 14, 2025

HNK: మెరుగైన సేవలు అందించాలి: DMHO

image

ఆరోగ్య సమస్యలతో ప్రాథమిక కేంద్రాలకు వచ్చే ప్రజలకు ఓపికతో వారి సమస్యలను విని అవసరమైన సేవలు అందించాలని DMHO అప్పయ్య అన్నారు. ఎల్కతుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అవుట్ పేషెంట్ రిజిస్టర్‌ని పరిశీలించి ఎంతమంది ఏ విధమైన సమస్యలతో వస్తున్నారని వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

News November 14, 2025

జిల్లా వ్యాప్తంగా పంచారామాలకి బస్సులు

image

పంచారామ క్షేత్రాల దర్శనానికి కార్తీక మాసం సందర్భంగా ప్రతి ఆదివారం రాత్రి ఏలూరు జిల్లా వ్యాప్తంగా సెమీ లగ్జరీ, సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేసినట్లు ప్రజా రవాణా అధికారి ఎస్‌కే షబ్నం తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రతి డిపో నుంచి బస్సులు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.