News January 27, 2025
బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు

బాపట్ల జిల్లా పోలీస్ క్యాంప్ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. రాజ్యాంగ ముసాయిదా రచించిన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26న అమలుపరిచారని, తద్వారా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నట్లు వివరించారు.
Similar News
News February 9, 2025
మెదక్: నకిలీ బంగారంతో భారీ మోసం.. నలుగురి అరెస్ట్

నకిలీ బంగారం పెట్టి తూకంలో మోసం చేసిన ఘటన నర్సాపూర్లో జరిగింది. పోలీసుల వివరాలు.. పట్టణంలోని ముత్తూట్ మినీ ఫైనాన్స్ మేనేజర్గా గుండె రాజు సంస్థలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. తనకు పరిచయం ఉన్న సురేశ్, ఆకాశ్లతో కలిసి నకిలీ బంగారంతో చేసి రూ.7,20,356 నగదును సంస్థ నుంచి తీసుకుని బ్యాంకును మోసం చేసి తప్పించుకున్నాడు. రీజనల్ మేనేజర్ రాజు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేశారు.
News February 9, 2025
మంచిర్యాల: పావురం కోసం క్రేన్ పంపిన కలెక్టర్

నస్పూర్లోని సీసీసీ కార్నర్లో సెంట్రల్ లైటింగ్ స్తంభంపై ఓ పావురం గాలిపటం దారానికి చిక్కుకుంది. గమనించిన స్థానికులు కలెక్టరేట్కు సమాచారం అందజేయడంతో స్పందించి కలెక్టర్ క్రేన్ను పంపించారు. అక్కడకు చేరుకున్న మున్సిపల్ సిబ్బంది నిచ్చెన సాయంతో పైకి ఎక్కి దాన్ని విడిపించారు. దీంతో పావురం అక్కడనుంచి స్వేచ్ఛగా ఎగిరిపోయింది.
News February 9, 2025
భార్యను నరికిన ఘటనలో మరో సంచలనం!

TG: హైదరాబాద్ మీర్పేట్లో భార్యను ముక్కలుగా నరికిన <<15262482>>ఘటనలో<<>> మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. వెంకటమాధవిని చంపేందుకు భర్త గురుమూర్తికి మరో ముగ్గురు కుటుంబీకులు సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారని భావిస్తున్నారు. ఆ ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు శనివారం నుంచి గురుమూర్తిని కస్టడీలోకి తీసుకొని మరింత లోతుగా విచారిస్తున్నారు.