News February 9, 2025

బాపట్ల జిల్లా ప్రముఖ గాయని మృతి

image

బాపట్ల మండలం నరసాయపాలేనికి చెందిన ప్రముఖ గాయని కారుమంచి కోటిరాజ్(88) శనివారం మృతి చెందారు. ఈమె సప్తస్వర సంగీత కళాశాల ప్రిన్సిపల్‌గా పని చేశారు. ఈమె ఏడేళ్ల వయసులోనే సంగీతం నేర్చుకోవడం మొదలు పెట్టారు. సినీ సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి ఆధ్వర్యంలో ఆమె పలు సినిమాలకు పాటలు కూడా పాడారు. బాపట్ల జమేదారుపేటలో 27ఏళ్ల క్రితం స్థిరపడి సప్తస్వర సంగీత కళాశాల ఏర్పాటు చేసి, అనేకమందికి సంగీతం నేర్పించారు.

Similar News

News December 3, 2025

KNR: CM మీటింగ్‌కు 144 RTC బస్సులు.. తిప్పలు..!

image

హుస్నాబాద్‌లో తలపెట్టిన ముఖ్యమంత్రి బహిరంగ సభకు కరీంనగర్ రీజియన్ పరిధిలో ఐదు డిపోల నుంచి 144 ఆర్టీసీ బస్సులను బుక్ చేశారు. వీటిల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల పరిధిలో ఉన్న ప్రజలను తరలించనున్నారు. ఇదిలాఉండగా నిత్యం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికోసం అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఉన్న అరకొర బస్సులను సీఎం మీటింగ్‌కు అలాట్ చేయడంతో ప్రజలకు తిప్పలు తప్పేలాలేవు.

News December 3, 2025

కాకినాడ: చాపకింద నీరులా ‘స్క్రబ్‌ టైఫస్‌’ వ్యాధి

image

కాకినాడ జిల్లాలో 148 ‘స్క్రబ్‌ టైఫస్‌’ పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు DMHO నరసింహ నాయక్ తెలిపారు. కాకినాడ అర్బన్‌‌లో 58, కాకినాడ రూరల్‌ 17, పెద్దాపురం 15, సామర్లకోట 11, తొండంగి 6, ప్రత్తిపాడు 5, తాళ్లరేవు 5, గొల్లప్రోలు 4, కిర్లంపూడి 4, యు.కొత్తపల్లి 4, కరప 4, కాజులూరు 3, రౌతులపూడి 3, జగ్గంపేట 2, పిఠాపురం 2, శంఖవరం 2, తుని 1, ఏలేశ్వరం 1, గండేపల్లి 1 చొప్పున కేసులు నమోదయ్యాయి.

News December 3, 2025

₹274 కోట్లు దోచి పరారైన డోన్ రియల్టర్!

image

డోన్‌కు చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారి ఏపీ, తెలంగాణ, కర్ణాటకలోని ప్రముఖుల నుంచి ₹274 కోట్లు అప్పులు, పెట్టుబడుల రూపంలో వసూలు చేసి అమెరికా పరారయ్యాడు. చిరుద్యోగి అయిన అతడు స్థిరాస్తి వ్యాపారంలోకి దిగి బెంగళూరులో ఆఫీస్ ప్రారంభించాడు. సొంత డబ్బుతో విదేశీ యాత్రలు, పార్టీలు ఇస్తూ ప్రముఖులకు దగ్గరై భారీగా డబ్బులు వసూలు చేశాడు. కొన్ని రోజులుగా అందుబాటులో లేకపోవడంతో బాధితులు బయటకు చెప్పలేక కుమిలిపోతున్నారు.