News February 6, 2025

బాపట్ల జిల్లా మంత్రులకు CM ర్యాంకులు

image

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో బాపట్ల జిల్లా మంత్రి గొట్టిపాటి రవికుమార్‌‌ 13వ ర్యాంక్, అనగాని సత్యప్రసాద్‌ 21 ర్యాంక్ పొందారు. పనితీరును మెరుగు పరుచుకోవాలని CM సూచించారు.

Similar News

News February 7, 2025

సర్పంచ్ ఎన్నికలకు సంగారెడ్డి జిల్లా వివరాలు

image

గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతుండడంతో జిల్లాలోని అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఇప్పటినుంచి తమ వంతుగా ప్రయత్నాలు ప్రారంభించాయి. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు, 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. ZPTC- 27, MPP-27, ఎంపీటీసీ- 276, గ్రామ పంచాయతీలు 633 ఉన్నాయి. ఎంపీటీసీ స్థానాలు 295 నుంచి 276 కు తగ్గించారు. జెడ్పిటిసిలు 25 నుంచి 27 కు పెరిగాయి. గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది.

News February 7, 2025

కోహ్లీ ఫిట్‌నెస్‌పై మాజీ క్రికెటర్ సెటైర్లు

image

టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌పై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సెటైర్లు వేశారు. ‘జనవరిలో మెడ నొప్పి.. ఫిబ్రవరిలో మోకాలు నొప్పి.. ఇదేం ఫిట్‌నెస్.. ఏదైతేనేం కటక్ మ్యాచ్ నాటికి కోహ్లీ పూర్తిగా కోలుకోవాలి’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో మోకాలి గాయం కారణంగా కోహ్లీ బరిలోకి దిగని విషయం తెలిసిందే. ఆయన స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడారు.

News February 7, 2025

సుమతీ నీతి పద్యం- తాత్పర్యం

image

ఏఱకుమీ కసుగాయలు
దూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీ
పాఱకుమీ రణమందున
మీఱకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ!
తాత్పర్యం: నేలమీద పచ్చికాయలను ఏరుకుని తినవద్దు. బంధువులను, ప్రజలను దూషించవద్దు. యుద్ధము నుంచి వెనుతిరిగి పారిపోరాదు. పెద్దల ఆజ్ఞను అతిక్రమించరాదు.

error: Content is protected !!