News February 23, 2025

బాపట్ల జిల్లా విద్యుత్ వినియోగదారులకు గమనిక

image

కరెంట్ బిల్లు చెల్లించుటకు బాపట్ల జిల్లాలోని అన్ని విద్యుత్ రెవెన్యూ కేంద్రాలలోని కౌంటర్లు ఆదివారం తెరిచే ఉంటాయని, బాపట్ల విద్యుత్ శాఖ సూపరింటెండ్ ఇంజినీర్ ఆంజనేయులు తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి, ఇప్పటివరకు విద్యుత్ బిల్లులు చెల్లించనివారు ఆదివారం బిల్లులను చెల్లించాలని కోరారు.

Similar News

News November 24, 2025

వేములవాడలో ప్రచార రథం వద్ద కొనసాగుతున్న దర్శనాలు

image

వేములవాడ రాజన్న క్షేత్రంలో ఆలయం ముందు భాగంలోని ప్రచార రథం వద్ద భక్తులు రాజన్నను దర్శించుకుంటున్నారు. ప్రచార రథంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రీ స్వామివారి ఉత్సవ విగ్రహాలను వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దర్శించుకుంటున్నారు. ప్రధాన ఆలయంలో అర్చకులు నిర్వహిస్తున్న స్వామివారి నిత్య కైంకర్యాలను ఎల్ఈడి స్క్రీన్ పై వీక్షించి తరిస్తున్నారు.

News November 24, 2025

శబరిమల యాత్రకు మంథని డిపో నుంచి ప్రత్యేక బస్సు

image

శబరిమల భక్తుల కోసం మంథని డిపో ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు DM శ్రావణ్‌కుమార్ తెలిపారు. వెళ్లేటప్పుడు మంథని-హైదరాబాద్-శ్రీశైలం-మహానంది-కాణిపాకం-పంబ, తిరుగు ప్రయాణంలో మదురై-రామేశ్వరం-తిరుపతి మార్గంగా బస్సు నడుస్తుంది. చార్జీ ₹6900. బార్డర్ ట్యాక్స్, పార్కింగ్ ఫీజులు ప్రయాణికులే చెల్లించాలి. 35 సీట్లు బుక్ చేసిన గ్రూపులకు 5మందికి ఉచిత ప్రయాణం. బుకింగ్‌కు: 9959225923, 9948671514

News November 24, 2025

జిల్లా కలెక్టరేట్లో రేపు దిశ సమావేశం

image

జనగామ కలెక్టరేట్లో మంగళవారం దిశ సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి పేర్కొన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య ఆదేశాలతో ఈ సమావేశం నిర్వహిస్తున్నామని, రేపు ఉదయం 11 గం.కు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించబడుతుందని తెలిపారు. ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొనాలని కోరారు.