News March 17, 2025
బాపట్ల జిల్లా వ్యాప్తంగా 234 మంది విద్యార్థులు గైర్హాజరు

పదవ తరగతి పరీక్షలు బాపట్ల జిల్లాలో మొదటి రోజు తెలుగు పరీక్ష ప్రశాంతంగా జరిగాయని అధికారులు వెల్లడించారు. మొత్తం 103 పరీక్షా కేంద్రాలలో మొత్తం 16481 మంది విద్యార్థులకు గాను 16247 మంది విద్యార్థులు హాజరయ్యారు. 234 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా పర్యవేక్షణ అధికారిణి మతి గంగాభవాని తెలిపారు. మొత్తం పరీక్షలకు 98.5 శాతం విద్యార్థులు హాజరయ్యారు.
Similar News
News January 5, 2026
తిరుమల: FEB 19 నుంచి విద్వత్ సదస్సు

తిరుమల ధర్మగిరి శ్రీవేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో ఫిబ్రవరి 19 నుంచి 24 వరకు శ్రీ వేంకటేశ్వర వేద-శాస్త్ర-ఆగమ-విద్వత్ సదస్సు జరగనుంది. ఇందులో వేదాలు, శాస్త్రాలు, ఆగమాలు, పురాణాలు, ఇతిహాసాల తదితర వాటిపై మౌఖిక, లేఖన పరీక్షలు జరగనున్నాయి. అదే విధంగా 21న ప్రతివర్ష పండితులకు వార్షిక సభ జరుగుతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమైన్నాయి.
News January 5, 2026
NLG: అమ్మ బాబోయ్.. కేజీ రూ.300లా!

నల్గొండ జిల్లాలో చికెన్ రేటు ట్రిపుల్ సెంచరీ కొట్టింది. కిలో మాంసం రూ.300కి చేరడంతో మాంసం ప్రియులు బెంబేలెత్తుతున్నారు. గుడ్డు ధర రూ.8.50 ఉండగా.. లైవ్ కోడి రూ.185, స్కిన్లెస్ రూ.290-310 పలుకుతోంది. బర్డ్ ఫ్లూతో ఉత్పత్తి తగ్గిందని, అందుకే రేట్లు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. పండగ పూట ముక్క లేకపోతే ఎలా అని మాంసం ప్రియులు వాపోతుండగా, రేట్లు ఇప్పట్లో దిగిరావని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
News January 5, 2026
NLG: టెట్ అభ్యర్థులకు తప్పని తిప్పలు

టెట్ అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల కేటాయింపు ఇబ్బందిగా మారింది. మొదటి రోజే అప్లై చేసినా, ప్రాధాన్యత క్రమంలోని చివరి పట్టణాల్లో కేంద్రాలు కేటాయించడంతో అభ్యర్థులు వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో ఒక రోజు ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు. జిల్లా నుంచి 1,557 మంది ఉపాధ్యాయులతో సహా సుమారు 3 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 4న ప్రారంభమైన పరీక్షలు 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి.


