News March 17, 2025

బాపట్ల జిల్లా వ్యాప్తంగా 234 మంది విద్యార్థులు గైర్హాజరు

image

పదవ తరగతి పరీక్షలు బాపట్ల జిల్లాలో మొదటి రోజు తెలుగు పరీక్ష ప్రశాంతంగా జరిగాయని అధికారులు వెల్లడించారు. మొత్తం 103 పరీక్షా కేంద్రాలలో మొత్తం 16481 మంది విద్యార్థులకు గాను 16247 మంది విద్యార్థులు హాజరయ్యారు. 234 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా పర్యవేక్షణ అధికారిణి మతి గంగాభవాని తెలిపారు. మొత్తం పరీక్షలకు 98.5 శాతం విద్యార్థులు హాజరయ్యారు.

Similar News

News February 23, 2026

బ్రహ్మోస్ కంటే వేగంగా.. భూగర్భ బంకర్లను ఛేదించేలా..

image

భారత్‌కు గోల్డెన్ హొరైజన్ మిస్సైల్ అందించేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ వద్ద ఉన్న బ్రహ్మోస్ కంటే ఇది ఎన్నో రెట్లు వేగవంతమైనది. 2000KM లక్ష్యాన్ని ఛేదించగల ఈ మిస్సైల్‌ను ఫైటర్‌జెట్ నుంచి కూడా ప్రయోగించొచ్చు. su-30MKIతో భారత్ వీటిని ఉపయోగించే ఛాన్స్ ఉంది. కచ్చితత్వంతో భూగర్భ బంకర్లనూ ఈ మిస్సైల్ ధ్వంసం చేయగలదు. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో దీనిపై డీల్ జరిగే అవకాశం ఉంది.

News February 23, 2026

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్

image

TG: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 16 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించాలని సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్ భేటీలో నిర్ణయించారు. 16వ తేదీ గవర్నర్ ప్రసంగం ఉండనుంది. 17, 18వ తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుంది. మార్చి 20వ తేదీ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

News February 23, 2026

కేయూ పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు వాయిదా

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 25, 26న నిర్వహించాల్సిన పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కట్ల రాజేందర్ తెలిపారు. వాయిదా పడిన పరీక్షల్లో నాన్-ప్రొఫెషనల్ కోర్సులు (MA, MSC, M.com)తో పాటు ప్రొఫెషనల్ కోర్సులు ఎంబీఏ, ఎంసీఏ ఉన్నాయి. ఈ పరీక్షలను మళ్లీ నిర్వహించే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.