News April 9, 2025
బాపట్ల జిల్లా DCHS బాధ్యతల స్వీకరణ

బాపట్ల జిల్లా హాస్పిటల్స్ కోఆర్డినేటర్గా మోజేష్ కుమార్ నియమితులయ్యారు. బుధవారం బాపట్ల జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో DCHSగా పనిచేసిన శేషు కుమార్ కృష్ణాజిల్లాకు బదిలీ కావడంతో ఆయన స్థానంలో నూతన డీసీహెచ్గా మోజేష్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో వైద్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు కృషి చేస్తానన్నారు.
Similar News
News November 13, 2025
శ్రీరాంపూర్: 17న 100 మస్టర్లు లేని ఉద్యోగులకు కౌన్సిలింగ్

శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 7 గనిలో ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నెల వరకు 100 మస్టర్లు లేని ఉద్యోగులు ఈనెల 17న జరిగే కౌన్సిలింగ్కు హాజరు కావాలని మేనేజర్ తిరుపతి సూచించారు. ఏ, బీ రిలే ఉద్యోగులకు ఉ.9 నుంచి 12 గంటల వరకు, సి, డి రిలే ఉద్యోగులకు మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు గని కార్యాలయం, క్యాంటీన్లో కౌన్సిలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు.
News November 13, 2025
అదానీ కోసమే భూటాన్కు మోదీ: ప్రియాంక్ ఖర్గే

తన ఫ్రెండ్ అదానీకి లబ్ధి చేకూర్చేందుకే భూటన్లో ప్రధాని మోదీ పర్యటించారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కుమారుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. ‘ఢిల్లీలో ఉగ్రదాడితో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఈ సమయంలో ప్రధాని మోదీ భూటాన్ ఎందుకు వెళ్లారు? అదానీ డీల్ కోసం’ అని రాసుకొచ్చారు. అదానీ పవర్కు రూ.6000 కోట్ల హైడ్రో ప్రాజెక్ట్ డీల్పై సంతకం కోసం మోదీ భూటాన్ వెళ్లారని ఎక్స్లో ఫొటో ట్యాగ్ చేశారు.
News November 13, 2025
ఈ సమయంలో వరిని ఆశించే తెగుళ్లు – నివారణకు సూచనలు

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వరి పంటలో మెడవిరుపు, గింజ మచ్చ తెగులు, సుడిదోమ, కంకినల్లి ఆశించే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. వరిలో మెడవిరుపు లక్షణాలు కనిపిస్తే 200 లీటర్ల నీటిలో ఐసోప్రోథియోలేన్ 300ml లేదా కాసుగామైసిన్ 500ml కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. గింజమచ్చ, కంకినల్లిని గమనిస్తే స్పైరోమెసిఫెన్ 1ml+ ప్రొపికొనజోల్ 1ml లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.


