News March 14, 2025

బాపట్ల జిల్లా TO DAY TOP HEADLINES

image

◆ పర్చూరు అభివృద్ధి లక్ష్యం: ఎమ్మెల్యే ఏలూరి◆ఉపాధి కూలీలు అపోహలు పడవద్దు: కొరిశపాడు ఏపీవో◆వేటపాలెం: అక్రమ మద్యం స్వాధీనం◆కొల్లూరు: మట్టి రోడ్డుకు అభివృద్ధి పనులు◆సామాన్య ప్రజలకు కార్పొరేట్ వైద్యం: ఎమ్మెల్యే ఏలూరి◆వారంలో ఒకరోజు గ్రామ పర్యటన: వేగేశన◆కారంచేడు: లంపి వైరస్తో ఆవులు విలవిల◆మాణిక్యవేల్ మృతి బాధాకరం: వేమూరు ఎమ్మెల్యే◆సింగరకొండ దేవాలయ స్పెషాలిటీ ఇదే..!

Similar News

News March 15, 2025

పాక్‌కు బిగ్ షాక్: 214 సైనికుల్ని చంపేసిన BLA

image

పాకిస్థాన్‌కు చావుదెబ్బ తగిలింది. జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసి బంధించిన 214 మంది సైనికులను బలూచ్ లిబరేషన్ ఆర్మీ చంపేసింది. ‘యుద్ధ ఖైదీలను విడుదల చేయాలని పాక్ ఆర్మీకి 48hrs గడువిచ్చాం. వారి జవాన్లను రక్షించుకొనేందుకు ఇచ్చిన ఆఖరి అవకాశాన్ని పొగరుతో కాలదన్నారు. క్షేత్ర పరిస్థితుల్ని పట్టించుకోలేదు. అందుకే 214 మందిని హతమార్చాం. మా 12మంది అమర వీరులకు నివాళి అర్పిస్తున్నాం’ అని BLA ప్రకటించింది.

News March 15, 2025

VKB: నేటి నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం

image

వికారాబాద్ జిల్లాలో నేటి నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటి పూట బడులు ప్రారంభమవుతాయని జిల్లా విద్యాధికారి రేణుకాదేవి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 176 ఉన్నత,18 కేజీబివి, మోడల్ 9, యూపీఎస్లు114, ప్రాథమిక 770 పాఠశాలలు ఉండగా అందులో 1,22,556 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు. అలాగే ఈనెల 21 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు జరుగుతాయన్నారు.

News March 15, 2025

మందమర్రి: GREAT.. గ్రూప్- 2,3,4 సాధించిన తిరుపతి

image

మందమర్రి ప్రాణహిత కాలానికి చెందిన <<15738168>>బొడ్డు తిరుపతి గ్రూపు- 4, 2, 3లలో సత్తాచాటి<<>> పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. 2016లో సింగరేణి నిర్వహించిన JMET ప్రవేశ పరీక్ష రాసి ఉద్యోగం సాధించాడు. తర్వాత గ్రూపు-4 పరీక్ష రాసి ఎన్నికై క్యాతనపల్లి మునిసిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. గ్రూప్-2లో రాష్ట్రస్థాయి 77 ర్యాంక్, తాజాగా విడుదలైన గ్రూప్-3ఫలితాల్లో రాష్ట్రస్థాయి 60వ ర్యాంకు సాధించాడు.

error: Content is protected !!