News January 31, 2025
బాపట్ల: నకిలీ టాస్క్ ఫోర్స్ అధికారి వేషం గుట్టురట్టు

నకిలీ టాస్క్ ఫోర్స్ అధికారి వేషాన్ని బందరు తాలూకా పోలీసులు గుట్టురట్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బాపట్ల (D) రేపల్లె చీకటాయపాలెంకు చెందిన హోమ్ గార్డ్ సుమన్ బందర్లో ఓ వైన్ షాప్కి ఫోన్ చేసి టాస్క్ ఫోర్స్ అధికారిని డబ్బులు చెల్లించకపోతే లైసెన్స్ రద్దు చేస్తామని బెదిరించారు. దీంతో వైన్షాప్ అధికారి ఓసారి ఫోన్ పే చేసి మరోసారి అడగగా.. వచ్చి తీసుకోవాలని కోరాడు. ఈ క్రమంలో పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
Similar News
News February 18, 2025
నర్సంపేట: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

నర్సంపేట -పాకాల మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగి యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. అశోక్ నగర్కు చెందిన వెంకటేశ్ నర్సంపేటలో షాపులో పని చేస్తుండేవాడు. సోమవారం రాత్రి పని ముగించుకుని బైక్పై ఇంటికి వెళుతున్న క్రమంలో ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 18, 2025
జి.సిగడాం: పింఛను సొమ్ముతో అధికారి జంప్

జి.సిగడాంలోని పెంట గ్రామ సచివాలయంలో సర్వేయర్ పింఛను సొమ్ముతో పరారైనట్లు సచివాలయ సిబ్బంది ఆరోపించారు. ఈ మేరకు వారు సర్వేయర్ భాను ప్రతాప్ రూ. 49 వేలు తీసుకెళ్లాడని సోమవారం తహశీల్దార్ ఎం. శ్రీకాంత్, ఎంపీడీవో రామకృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. ఈనెలకు సంబంధించి రూ. 1.66 లక్షల సొమ్ములో రూ. 1.17 లక్షలు పంపిణీ చేసి మిగిలిన సొమ్ముతో ఉడాయించినట్లు వారు ఆరోపించారు.
News February 18, 2025
భారత్లో అడుగుపెట్టనున్న టెస్లా..!

ఈవీ దిగ్గజం టెస్లా భారత్లో రిక్రూట్మెంట్ చేపట్టనుంది. ఈ మేరకు లింక్డిన్లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసింది. కస్టమర్రిలేటడ్, బ్యాక్ఎండ్ జాబులు భర్తీ చేయనుంది. జాబ్లొకేషన్ ముంబయి, ఢిల్లీఅని పేర్కొంది.ఇటీవలే భారత్ రూ.34 లక్షల పైన ధర ఉన్నకార్లకి ట్యాక్స్ 110శాతం నుంచి70కు తగ్గించింది. అంతేకాకుండా మోదీUSA పర్యటనలో ప్రధానితో మస్క్భేటీఅయ్యారు. ఈ నేపథ్యంలో టెస్లా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.