News February 14, 2025
బాపట్ల: ‘పరిశ్రమలకై ఔత్సాహికులను ప్రోత్సహించాలి’

పరిశ్రమల స్థాపన కొరకు ఔత్సాహికులను మరింత ప్రోత్సహించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. పరిశ్రమల ప్రోత్సాహక, అభివృద్ధిపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా సంయుక్త కలెక్టర్ అధ్యక్షతన స్థానిక కలెక్టరేట్లో గురువారం జరిగింది. బాపట్ల జిల్లాలోని వివిధ పరిశ్రమల నుంచి ఉత్పత్తి అవుతున్న వస్తువులను ఇతర ప్రాంతాలకు ఎగుమతి అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News December 4, 2025
NLG: ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు నియమావళి అమలు: రాణీ కుముదిని

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణీ కుముదిని గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రవర్తనా నియమావళి అమలుపై కీలక ఆదేశాలు జారీ చేశారు. గురువారం హైదరాబాద్ నుంచి జిల్లాల ఎన్నికల పరిశీలకులు, కలెక్టర్లు, పంచాయితీ రాజ్, పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొన్ని గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికైనప్పటికీ, ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసే వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందని తెలిపారు.
News December 4, 2025
కరీంనగర్: మూడు గ్రామాల్లో సర్పంచ్లు ఏకగ్రీవం

కరీంనగర్ జిల్లా మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో మూడుచోట్ల సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చొప్పదండి మండలం దేశాయిపేటలో తిరుపతి, పెద్దకురుమపల్లిలో స్వరూప ఏకగ్రీవం కాగా, రామడుగు మండలం శ్రీరాములపల్లిలో సుగుణమ్మ సర్పంచ్గా ఖరారయ్యారు. దేశాయిపేటలో సర్పంచ్తో పాటు పాలకవర్గం మొత్తం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా తెలిపారు.
News December 4, 2025
కరీంనగర్ జిల్లాలో 276 వార్డు సభ్యులు ఏకగ్రీవం

కరీంనగర్ జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుల ఏకగ్రీవాల సంఖ్య పెరిగింది. చొప్పదండి, గంగాధర, రామడుగు, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల్లోని మొత్తం 866 వార్డులకు గాను, 276 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 590 వార్డులకు ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు.


