News February 14, 2025
బాపట్ల: ‘పరిశ్రమలకై ఔత్సాహికులను ప్రోత్సహించాలి’

పరిశ్రమల స్థాపన కొరకు ఔత్సాహికులను మరింత ప్రోత్సహించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. పరిశ్రమల ప్రోత్సాహక, అభివృద్ధిపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా సంయుక్త కలెక్టర్ అధ్యక్షతన స్థానిక కలెక్టరేట్లో గురువారం జరిగింది. బాపట్ల జిల్లాలోని వివిధ పరిశ్రమల నుంచి ఉత్పత్తి అవుతున్న వస్తువులను ఇతర ప్రాంతాలకు ఎగుమతి అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News February 21, 2025
ఫిబ్రవరి 21: చరిత్రలో ఈరోజు

1894: శాస్త్రవేత్త శాంతి స్వరూప్ భట్నాగర్ జననం (ఫొటోలో)
1941: ఇన్సులిన్ సహ ఆవిష్కర్త ఫ్రెడరిక్ బాంటింగ్ మరణం
1976: సినీ గాయకుడు విజయ ప్రకాశ్ జననం
1977: సినీ గాయకుడు రంజిత్ జననం
1988: నటి వేదిక జననం
2013: దిల్సుఖ్ నగర్లో బాంబు పేలుళ్లు.. 18 మంది మృతి
* అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
News February 21, 2025
సంగారెడ్డి: పాఠశాలల HMలకు విద్యాధికారి సూచనలు

జిల్లాలోని 44 పాఠశాలకు పీఎంశ్రీ కింద విడుదలైన నిధులను పూర్తిగా వినియోగించుకోవాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం ఓ ప్రకటనలో కోరారు. ఆయన మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం నిధులను పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఖర్చు చేయాలని పేర్కొన్నారు. నిధులు ఖర్చు చేసిన తర్వాత సంబంధిత యూసీలను సమగ్ర శిక్ష కార్యాలయంలో సమర్పించాలని ఆదేశించారు.
News February 21, 2025
ఈరోజు నమాజ్ వేళలు

తేది: ఫిబ్రవరి 21, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 5.27 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.39 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
అసర్: సాయంత్రం 4.43 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.20 గంటలకు
ఇష: రాత్రి 7.33 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.