News March 10, 2025
బాపట్ల పీజీఆర్ఎస్కు 89 అర్జీలు

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో 89 అర్జీలు అందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఫిర్యాదులను చట్టపరిధిలో వేగంగా పరిష్కరించాలన్నారు. ప్రతి సోమవారం జరిగే కార్యక్రమంలో ప్రజలు స్వయంగా వచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు.
Similar News
News February 9, 2026
జగిత్యాల: ఎన్నికల సిబ్బంది మూడవ ర్యాండమైజేషన్ పూర్తి

రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సిబ్బంది మూడవ ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు జనరల్ అబ్జర్వర్ ఖర్టాడే కాళీచరణ్ సుదామా రావు, జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఈ ప్రక్రియ నిర్వహించారు. అనంతరం ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
News February 9, 2026
అంబటి రాంబాబుకు బెయిల్

AP: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో YCP నేత అంబటి రాంబాబుకు బెయిల్ వచ్చింది. ఈ కేసులో ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే మరో కేసులో ఇవాళ మధ్యాహ్నం స్పెషల్ జుడీషియల్ కోర్టు అంబటికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో మొదటి కేసులో బెయిల్ లభించినా ఆయన జైలు నుంచి బయటికి వచ్చే అవకాశం లేకుండా పోయింది. అటు రాష్ట్రవ్యాప్తంగా అంబటిపై 52 కేసులు నమోదైనట్లు సమాచారం.
News February 9, 2026
ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: నిర్మల్ కలెక్టర్

జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలలో ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఓటర్ గుర్తింపు పత్రాల పంపిణీ పూర్తయ్యిందని, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించామన్నారు. ఓటర్లు సౌకర్యవంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.


