News March 18, 2025

బాపట్ల: బయోమెట్రిక్‌ ఆధారంగా సచివాలయ సిబ్బందికి జీతాలు

image

సచివాలయ సిబ్బంది బయో మెట్రిక్ ద్వారా హాజరు వేయడం లేదని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. సిబ్బంది అందరూ బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేయాలన్నారు. హాజరు నమోదులో జిల్లా వెనుకబడి ఉందని ఆయన తెలిపారు. ఏప్రిల్ మాసము నుంచి జీతభత్యాలు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా చెల్లిస్తామన్నారు. సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా ఉదయం సాయంత్రం రెండు పూటలా బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేయాలని ఆయన అన్నారు.

Similar News

News November 23, 2025

రేపటి నుంచి అంతర్ జిల్లాల ఫెన్సింగ్ పోటీలు ప్రారంభం

image

AP పాఠశాల విద్యాశాఖ నిర్వహించనున్న 69వ అంతర్ జిల్లాల SGF-17 బాల బాలికల ఫెన్సింగ్ టోర్నమెంట్ సోమవారం నుంచి ఈనెల 26 వరకు సఖినేటిపల్లి మండలం మోరిలోని జాన సుబ్బమ్మ మెమోరియల్ హైస్కూల్ వద్ద నిర్వహించనున్నారు. ఈ మేరకు మండల విద్యాశాఖ అధికారులు కిషోర్ కుమార్, యం.వేంకటేశ్వరరావు ఆదివారం వివరాలు వెల్లడించారు. 3 రోజులు ఈ ఈవెంట్‌కు ఉన్నతాధికారులు హాజరుకానున్నట్లు హైస్కూల్ GHM శ్రీధర్ కృష్ణ తెలిపారు.

News November 23, 2025

తంబళ్లపల్లె టీడీపీలో కలవరం?

image

తంబళ్లపల్లె టీడీపీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు నాయకులు, కార్యకర్తలను కలవరపెడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో TDP అభ్యర్థి జయచంద్రా రెడ్డి ఓటమి చెందగా.. ములకలచెరువు కల్తీ మద్యం వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటూ 2 నెలల క్రితం సస్పెండ్ అయ్యారు. ఇక బుధవారం అంగళ్లులో జరిగిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సమక్షంలోనే తెలుగు తమ్ముళ్ల వర్గపోరు బాహాటమైంది.

News November 23, 2025

సర్పంచి ఎన్నికలు.. UPDATE

image

TG: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఈ రిజర్వేషన్ల జాబితాను జిల్లాల కలెక్టర్లకు పంపిస్తోంది. సాయంత్రం కల్లా ఈ ప్రక్రియ పూర్తికానున్నట్లు తెలుస్తోంది. జనాభా నిష్పత్తిని బట్టి SC, ఎస్టీ, బీసీ స్థానాలను కేటాయించినట్లు సమాచారం. కాగా బీసీలకు 22%తో కలుపుకొని మొత్తం రిజర్వేషన్లు 50% మించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.