News March 18, 2025
బాపట్ల: బయోమెట్రిక్ ఆధారంగా సచివాలయ సిబ్బందికి జీతాలు

సచివాలయ సిబ్బంది బయో మెట్రిక్ ద్వారా హాజరు వేయడం లేదని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. సిబ్బంది అందరూ బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేయాలన్నారు. హాజరు నమోదులో జిల్లా వెనుకబడి ఉందని ఆయన తెలిపారు. ఏప్రిల్ మాసము నుంచి జీతభత్యాలు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా చెల్లిస్తామన్నారు. సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా ఉదయం సాయంత్రం రెండు పూటలా బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేయాలని ఆయన అన్నారు.
Similar News
News November 17, 2025
సర్పంచ్ ఎన్నికలకు 10 రోజుల్లోపే నోటిఫికేషన్?

TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపైనే చర్చిస్తున్నారు. తొలుత వచ్చే నెలలో షెడ్యూల్ ఇవ్వాలని భావించినా దాన్ని ఈ నెలలో విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. SC ఆదేశాల ప్రకారం 50% రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు టాక్. తొలుత నిర్వహించే సర్పంచ్ ఎన్నికలకు 10 రోజుల్లోపే నోటిఫికేషన్ రానున్నట్లు సమాచారం.
News November 17, 2025
సర్పంచ్ ఎన్నికలకు 10 రోజుల్లోపే నోటిఫికేషన్?

TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపైనే చర్చిస్తున్నారు. తొలుత వచ్చే నెలలో షెడ్యూల్ ఇవ్వాలని భావించినా దాన్ని ఈ నెలలో విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. SC ఆదేశాల ప్రకారం 50% రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు టాక్. తొలుత నిర్వహించే సర్పంచ్ ఎన్నికలకు 10 రోజుల్లోపే నోటిఫికేషన్ రానున్నట్లు సమాచారం.
News November 17, 2025
కేయూ: ఆ సభ్యుల నియామకంపై SFI తీవ్ర అభ్యంతరం

కాకతీయ యూనివర్సిటీ విచారణ కమిటీల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులను సభ్యులుగా పెట్టడాన్ని SFI తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గత కమిటీ నివేదికలపై చర్యలు తీసుకోకపోవడం అధికార దుర్వినియోగమని పేర్కొంటూ ప్రిన్సిపల్, హాస్టల్ ఛైర్మన్ ఆధ్వర్యంలో కొత్త కమిటీ ఏర్పాటుకు విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. అందుకు సంబంధించి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ప్రొఫెసర్ రామచంద్రానికి వినతిపత్రం అందించింది.


