News March 18, 2025
బాపట్ల: బయోమెట్రిక్ ఆధారంగా సచివాలయ సిబ్బందికి జీతాలు

సచివాలయ సిబ్బంది బయో మెట్రిక్ ద్వారా హాజరు వేయడం లేదని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. సిబ్బంది అందరూ బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేయాలన్నారు. హాజరు నమోదులో జిల్లా వెనుకబడి ఉందని ఆయన తెలిపారు. ఏప్రిల్ మాసము నుంచి జీతభత్యాలు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా చెల్లిస్తామన్నారు. సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా ఉదయం సాయంత్రం రెండు పూటలా బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేయాలని ఆయన అన్నారు.
Similar News
News November 22, 2025
తుని: రైలు నుంచి జారిపడి ఒకరు మృతి

తుని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో రైలు నుంచి జారిపడి ఒకరు మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. శనివారం రేగుపాలెం-ఎలమంచిలి రైల్వే స్టేషన్ల మధ్య ప్రయాణించిన ట్రైన్ నుంచి జారి పడి ఇతను మరణించి ఉండవచ్చని రైల్వే పోలీసులు చెబుతున్నారు. మృతుడికి 30 ఏళ్లు ఉంటాయని, మిలిటరీ గ్రీస్ కలర్ ఫుల్ హాండ్స్ టీషర్ట్, నలుపు రంగు షార్ట్ ధరించి ఉన్నాడని చెప్పాడు.
News November 22, 2025
VKB: మహిళా భద్రతకు ప్రత్యేక చర్యలు: ఎస్పీ స్నేహ

శాంతి భద్రతే తొలి ప్రాధాన్యమని, మహిళా భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నూతన ఎస్పీ స్నేహ మెహ్రా అన్నారు. హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా సమర్థవంతంగా విధులు నిర్వహించిన స్నేహ మెహ్రా శనివారం నూతన ఎస్పీగా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలు, పిల్లల భద్రతకు, రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని అన్నారు.
News November 22, 2025
గుంటూరు కలెక్టరేట్లో ఉచిత కంటి ఆపరేషన్లు!

గుంటూరు కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్లు చేస్తామని DMHO డా.విజయలక్ష్మి తెలిపారు. ఓ నేత్ర వైద్యశాల మొబైల్ ఐ క్లినిక్ ద్వారా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని అన్నారు. కలెక్టర్ తమీమ్ అన్సారీయా ఆద్వర్యంలో వీటిని ఏర్పాటుచేసినట్లు, ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని DMHO వివరించారు.


