News March 18, 2025

బాపట్ల: బయోమెట్రిక్‌ ఆధారంగా సచివాలయ సిబ్బందికి జీతాలు

image

సచివాలయ సిబ్బంది బయో మెట్రిక్ ద్వారా హాజరు వేయడం లేదని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. సిబ్బంది అందరూ బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేయాలన్నారు. హాజరు నమోదులో జిల్లా వెనుకబడి ఉందని ఆయన తెలిపారు. ఏప్రిల్ మాసము నుంచి జీతభత్యాలు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా చెల్లిస్తామన్నారు. సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా ఉదయం సాయంత్రం రెండు పూటలా బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేయాలని ఆయన అన్నారు.

Similar News

News April 18, 2025

వనపర్తి జిల్లాలో వ్యక్తికి జైలు శిక్ష..!

image

వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల కేంద్రంలో గురువారం ఎస్ఐ కే.రాణి ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. సంగినేనిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మద్యం తాగి ఆటో నడిపినందుకు ఫస్ట్ అడిషనల్ జడ్జి ఆ వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష విధించారని కోర్టు పోలీస్ రాజేందర్ తెలిపారు. అలాగే మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి ఫైన్ విధించారన్నారు.

News April 18, 2025

కాంగ్రెస్ బతుకు అగమ్యగోచరమే: బండి సంజయ్

image

TG: రాహుల్, సోనియా గాంధీ పేర్లను ED ఛార్జ్‌షీట్‌లో చేర్చడంపై HYD ఈడీ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ‘దేశ ప్రజలంతా ఛీత్కరించుకోవడం, దేశాన్ని ఇంకా దోపిడీ చేయలేకపోయామనే నిరాశలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. వివేకం, వ్యక్తిత్వం వదిలేసి PMపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. వారి భాష చూస్తే 2029 కాదు, యుగం గడిచినా ఆ పార్టీ బతుకు అగమ్యగోచరమే’ అని ట్వీట్ చేశారు.

News April 18, 2025

గద్వాల: రామకృష్ణ మృతి.. ట్రాన్స్‌జెండర్, మరో వ్యక్తి రిమాండ్

image

గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రానికి చెందిన రామకృష్ణ ఐదు రోజుల క్రితం అనుమానాస్పదంగా మృతిచెందాడు. అతడి మృతిపై పలు అనుమానాలున్నాయని పేర్కొంటూ, ట్రాన్స్‌జెండర్ శివానితో పాటు మరో ముగ్గురిపై భార్య కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం మల్దకల్ పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. గురువారం ట్రాన్స్‌జెండర్ శివాని, రాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు.

error: Content is protected !!