News March 23, 2025

బాపట్ల: బీసీ కార్పొరేషన్ రుణాలకు గడువు పొడిగింపు 

image

బాపట్ల జిల్లాలోని స్వయం ఉపాధి రుణాల దరఖాస్తుల గడువు పొడిగించినట్లు బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. స్వయం ఉపాధి రుణాల దరఖాస్తుకు ఈనెల 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఇచ్చిన గడువును.. మరో మూడు రోజులు పాటు పొడిగించామన్నారు. ఈ నెల 25వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

Similar News

News October 29, 2025

మొంథా ఎఫెక్ట్.. ములుగు జిల్లాకు ఎల్లో అలర్ట్!

image

మొంథా తుఫాను ఎఫెక్ట్ కారణంగా ములుగు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇందులో భాగంగా జిల్లాకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సాధారణ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షాల కారణంగా రైతులు, ప్రజలు, పాఠశాలకు వెళ్లే విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలన్నారు. స్థానిక అధికారులు ఆయా ప్రాంతాల్లోని రైతులను, మత్స్యకారులను అప్రమత్తం చేయాలని సూచించారు.

News October 29, 2025

14 గంటలు ఆలస్యంగా అగర్తలా హంసఫర్ రైలు

image

మొంథా తుపాన్ నేపథ్యంలో చాలా రైళ్లు రద్దు చేసినప్పటికీ సుమారు 8 రైళ్లు మాత్రం ఆలస్యంగా నడుస్తున్నాయి. వాటిలో బెంగళూరు నుంచి బయలుదేరే అగర్తలా హంసఫర్ (12503) సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సుమారు 14 గంటలు ఆలస్యంగా నడుస్తోంది. ఈ రైలు విశాఖకు బుధవారం ఉదయం నాలుగు గంటల 10 నిమిషాలకు రావాల్సి ఉంది. అయితే సుమారు రాత్రి 7 గంటలకు చేరుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

News October 29, 2025

జిల్లా అధికారులకు కలెక్టర్ సూచనలు

image

జిల్లా అధికారులు, ప్రత్యేక అధికారులు, జోనల్ అధికారులు, రెవెన్యూ అధికారులతో కలెక్టర్ MN హరేంద్ర ప్రసాద్ బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను అనంతరం తీసుకోవలసిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పారిశుద్ధ్యం, నీటి వనరుల క్లోరినేషన్, దెబ్బతిన్న రోడ్లపై గుంతలు పూడ్చడం, ల్యాండ్ స్లయిడింగ్ జరిగిన చోట రోడ్‌‌ల పునరుద్ధరణపై జోనల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.