News February 23, 2025
బాపట్ల: ‘భూగర్భ జలాల పెరుగుదలకు చర్యలు చేపట్టాలి’

భూగర్భ జలాల పెరుగుదలకు అంగన్వాడీ కేంద్రాల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. భూగర్భ జలాల పెరుగుదలపై సంబంధిత శాఖల అధికారులతో శనివారం బాపట్ల కలెక్టరేట్ ఛాంబర్లో సమీక్ష నిర్వహించారు. జలవనరులను సంరక్షించడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వ భవనాలపై కురిసే వర్షపు నీరు నేరుగా ఇంకుడు గుంతల్లోకి వెళ్లేలా చూడాలన్నారు.
Similar News
News March 21, 2025
నల్గొండ: 25న గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు

నల్గొండ డైట్ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల పోస్టులను తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులకు ఈనెల 25న ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు. అభ్యర్థులకు ఆరోగ్య, వ్యాయామ విద్యను బోధించేందుకు ఎంపీఈడీ, దృశ్యకళలు, ప్రదర్శన కళలు బోధించేందుకు ఎంపీఏ/ఎంఎఫ్ఏ/బీఎఫ్ఏ అర్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు. SHARE IT.
News March 21, 2025
NRPT: పరీక్షల కోసం కఠిన భద్రతా ఏర్పాట్లు: ఎస్పీ

జిల్లా పరిధిలో పదో తరగతి పరీక్షల సందర్భంగా మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు 144 సెక్షన్ & 163 BNSS యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ యోగేష్ గౌతం తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 200 మీటర్ల దూరంలో ఐదుగురికిపైగా గుంపులు, ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు, సభలు, సమావేశాలు, ర్యాలీలు, నిషేధం అన్నారు. విద్యార్థులు సమయానికి బయలుదేరి, రోడ్డు ప్రయాణంలో జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ సూచించారు.
News March 21, 2025
వరంగల్: భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

భద్రకాళి అమ్మవారికి ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ఫాల్గుణ మాసం శుక్రవారం అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం భక్తులకు పూజలు చేసి వేదాశీర్వచనం, ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, సిబ్బంది, భక్తులు ఉన్నారు.