News February 6, 2025

బాపట్ల: మహేశ్ బాబు ఓటు తొలగింపు

image

ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గుంటూరు పట్టణ పరిధిలో ప్రముఖ సినీ హీరో మహేశ్ బాబు పేరుతో ఓటర్ జాబితాలో ఓటు నమోదైన విషయం తెలిసిందే. కాగా ఓటు హక్కును తొలగించినట్లు GMC అడిషనల్ కమిషనర్ ఓబులేసు తెలిపారు. ఫారం-7 విచారణ అనంతరం ఓటు హక్కు తొలగించినట్లు ఆయన చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

Similar News

News November 24, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్పంచుల రిజర్వేషన్లు ఖరారు

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్పంచుల రిజర్వేషన్లు అధికారికంగా ఖరారయ్యాయి.
మొత్తం 260 పంచాయతీలు ఉండగా..
63 జనరల్,
58 జనరల్ మహిళ..
29 బీసీ జనరల్,
24 బీసీ మహిళ..
32 ఎస్సీ జనరల్,
24 ఎస్సీ మహిళ..
17 ఎస్టీ జనరల్,
13 ఎస్టీ మహిళ స్థానాలుగా నిర్ణయించారు. మొత్తం మీద 121 పంచాయతీలు జనరల్ అభ్యర్థులకు, బీసీలకు 53, ఎస్సీలకు 56, ఎస్టీలకు 30 పంచాయితీలు దక్కనున్నాయి.

News November 24, 2025

మహబూబాబాద్: 482 జీపీల్లో బీసీలకు 24 స్థానాలే!

image

జిల్లాలో 18 మండలాల్లో 482 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కాగా సర్పంచ్ రిజర్వేషన్ స్థానాల్లో బీసీలకు అన్యాయం జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. మహబూబాబాద్- 1, కేసముద్రం -2, తొర్రూర్-6, పెద్ద వంగర- 3, నర్సింహులపేట-6, చిన్నగూడూర్ -1, నెల్లికుదురు -4, దంతాలపల్లి- 3 మొత్తం బీసీలకు 24 జీపీల్లోనే రిజర్వేషన్ స్థానాలను అధికారులు కేటాయించారు.

News November 24, 2025

స్థానిక ఎన్నికల తేదీలపై 25న క్యాబినెట్ నిర్ణయం!

image

TG: కోర్టుల ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికల్లో 50%లోపు రిజర్వేషన్లను ఖరారు చేశారు. పంచాయతీల రిజర్వేషన్లపై ఇవాళ కలెక్టర్లు గెజిట్‌ నోటిఫికేషన్లు జారీ చేస్తారు. కాగా హైకోర్టు ఉత్తర్వులను బట్టి షెడ్యూలు, నోటిఫికేషన్‌ విడుదలపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే మూడు దశల్లో నిర్వహణకు ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ నెల 25న జరిగే మంత్రివర్గ భేటీలో తేదీలు ఖరారయ్యే అవకాశం ఉంది.