News March 13, 2025

బాపట్ల: మృతురాలి వివరాలు గుర్తింపు

image

బాపట్ల పట్టణంలో లారీ ఢీకొని ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. బాపట్ల పట్టణ ఎస్ఐ చంద్రావతి పర్చూరు మండలం చెరుకూరుకు చెందిన శేషమ్మగా గుర్తించినట్లు బాపట్ల పట్టణ ఎస్ఐ చంద్రావతి తెలిపారు. మృతురాలు తన కూతురు వద్దకు వెళుతున్న సమయంలో లారీ ఢీకొనడంతో మృతి చెందినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News March 14, 2025

వికారాబాద్: అడవి పంది.. వ్యక్తి ప్రాణం తీసింది..!

image

అడవి పందిని తప్పించబోయి బైక్‌పై నుంచి పడి వ్యక్తి మృతిచెందిన ఘటన వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం రాఘవపూర్ శివారులో చోటుచేసుకుంది. మృతిచెందిన వ్యక్తి బొంరాస్‌పేట్ మండలం మెట్లకుంటకు చెందిన కావాలి సుధాకర్‌గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

News March 14, 2025

ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో టెండర్లకు ఆహ్వానం

image

ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రెండేళ్ల కాల పరిమితితో మందులు, శస్త్ర చికిత్స వినియోగ వస్తువులు, ప్రయోగశాల రసాయనాలు, ఆర్థో ఇంప్లాంట్లు, క్యాత్-ల్యాబ్ ఇంప్లాంట్ల కోసం టెండర్లు కోరుతున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్ కుమార్ తెలిపారు. ఆసక్తి గల ఏజెన్సీలు మార్చి 20 లోగా టెండర్ ఫారాలు తీసుకొని, దరఖాస్తులను ఏప్రిల్ 11 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాల్సి ఉంటుందని వెల్లడించారు.

News March 14, 2025

MHBD: కొడుకుతో ఇంటి నుంచి వెళ్లిపోయిన మహిళ

image

మహబూబాబాద్ జిల్లా ఇస్లావత్ తండాకు చెందిన భూక్యా శ్రీలతకు ఆమె భర్త మోతిలాల్‌కు మార్చి 4వ తేదీన వాగ్వాదం జరిగింది. అదే రోజు రాత్రి ఇంటి నుంచి తన కొడుకు వినయ్‌ని తీసుకొని శ్రీలత బయటకు వెళ్ళిపోయింది. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు ఇళ్లు, ఇతర చోట్ల వెతికారు. కాని ఆచూకీ లేకపోవడంతో తల్లి ఇస్లావత్ కాంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కురవి SI సతీష్ తెలిపారు.

error: Content is protected !!